సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసినట్లు డీవోపీ రత్నవేలు మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. 

రత్నవేలు ఇచ్చిన అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రత్నవేలు ట్విట్టర్ లో పేర్కొంటూ.. సముద్రం మధ్యలో భారీ అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేశాం. సముద్ర గర్భంలో, ఉపరితలంపై సాగే యాక్షన్ ఎపిసోడ్ ఇది. ఎన్టీఆర్ పై క్రేజీగా చిత్రీకరించిన సన్నివేశం అని రత్నవేలు పేర్కొన్నాడు. 

సముద్రం మధ్యలో సాగే సన్నివేశం కాబట్టి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వంద అడుగుల లోతైన నీటితో సెట్ వేసారట. ఆ సెట్ లోనే సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే టైటానిక్ ని తలపించే భారీ ఓడ సెట్ కూడా నిర్మించారట. ఎన్టీఆర్ శత్రువులని ఊచకోత కోసేలా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. 

ఏది ఏమైనా దేవర నుంచి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇది సముద్ర తీరంలో సాగే కథ అని కొరటాల ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.