'గద్దల కొండ గణేష్' కథ కు సీక్వెల్...టీజర్ అదిరింది
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం జిగర్తాండ (Jigarthanda). సిద్దార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
పిజ్జా సినిమాతో కెరీర్ ప్రారంభించిన కార్తిక్ సుబ్బరాజ్ కెరీర్ ప్రారంభంలో.. వరుస విజయాలతో తమిళంలో స్టార్ డైరెక్టర్గా మారాడు. అతని సినిమాల్లో జిగార్తండ చాలా మందికి ఇష్టం. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాబి సింహా ముఖ్య పాత్రలో నటించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమర్షియల్గా ఈ చిత్రం భారీగా సక్సెస్ కాలేక పోయినా విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. చిక్కడు దొరకడు పేరుతో ఈ సినిమా తెలుగులో డబ్ అయింది.
అయితే ఇదే ‘జిగార్తండ’ను వరుణ్ తేజ్తో ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. కానీ రీమేక్ అయ్యే అవకాసం కనపడటం లేదు. ఎందుకంటే ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పుడు టీజర్ వదిలారు. టీజర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.
వివరాల్లోకి వెళితే...కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం జిగర్తాండ (Jigarthanda). సిద్దార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా 8 ఏండ్ల తర్వాత సీక్వెల్ రెడీ అయింది.
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న సీక్వెల్ చిత్రం జిగర్తాండ 2 (Jigarthanda). గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న జిగర్తాండ 2 టీజర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి జిగర్తాండ డబుల్ ఎక్స్ టైటిల్ను ఫిక్స్ చేశారు. లారెన్స్ సర్ప్రైజ్ మాస్ లుక్లో కనిపిస్తుండగా.. ఎస్జే సూర్య సూట్లో క్లాసీ లుక్లో కనిపిస్తున్నాడు. ఇద్దరూ పోటీపడి మరి నటించి అభిమానులకు కావాల్సిన ఫుల్ మాస్ ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నారు.
కార్తీక్సుబ్బరాజు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.