బోనీకపూర్ కూతుళ్ల సెల్ఫీ!
దివంగత శ్రీదేవి మరణించిన తరువాత బోనీకపూర్ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయి
దివంగత శ్రీదేవి మరణించిన తరువాత బోనీకపూర్ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటివరకు విడిపోయి ఉన్న కుటుంబం కాస్త ఒకటయ్యింది. బోనీకపూర్ మొదటి భార్య పిల్లలు అన్షులా, అర్జున్ కపూర్ లు శ్రీదేవి పిల్లలతో కలిసిపోయారు.
జాన్వీ కపూర్ కు తన అన్నయ్య అర్జున్ కపూర్ ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నాడు. ప్రస్తుతం వీరందరూ కలిసి లండన్ లో విహరిస్తున్నారు. అలా హాలిడేలో తీసుకున్న ఫోటోలను తాజాగా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అన్షులాలతో పాటు బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ సంతోషి కూతురు తనీషా కూడా ఈ ఫోటోలో ఉంది. ఆ ఫోటోపై మీరు ఓ లుక్కేయండి!