Asianet News TeluguAsianet News Telugu

కంగనా రనౌత్ కి పద్మశ్రీ ఇవ్వడంపై జయసుధ అభ్యంతరం.. భారత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జయసుధ, జయప్రద కలసి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా కూడా పాల్గొంది.

jayasudha comments on kangana ranaut gets padma sri
Author
First Published Dec 26, 2022, 4:24 PM IST

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. 

అయితే కంగనా రనౌత్ విభిన్నమైన వ్యక్తిత్వం, నటన ప్రతిభకి భారత ప్రభుత్వం ఆమెని పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. అయితే కంగనాకి పద్మశ్రీ ఇవ్వడంపై అనేక కామెంట్స్ వినిపించాయి. 

ఆ జాబితాలో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ కూడా చేరారు. ఇటీవల జయసుధ, జయప్రద కలసి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా కూడా పాల్గొంది. 

ఈ షోలో జయసుధ బాలయ్యతో అనేక విషయాలు మాట్లాడింది. సౌత్ నటీనటులని భారత ప్రభుత్వం సరిగ్గా గుర్తించడం లేదు అని జయసుధ విమర్శించారు. అందుకు ఉదాహరణగా కంగనా రనౌత్ ని పేర్కొన్నారు. కంగనా రనౌత్ పట్టుమని పది చిత్రాల్లో కూడా నటించలేదు. కానీ ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇచ్చేశారు. 

కానీ సౌత్ లో నా లాంటి సీనియర్స్ కి ఆ గౌరవం దక్కడం లేదు. దశాబ్దాలుగా నటనలో రాణిస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఏ రకంగానూ గుర్తించడం లేదు. విజయనిర్మలగారు దర్శకురాలిగా గిన్నిస్ రికార్డ్ సాధించారు. కానీ ఆమెకి కూడా పద్మశ్రీ దక్కలేదు అని జయసుధ అన్నారు. జయసుధ కామెంట్స్ కి జయప్రద మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని తాను చాలా సార్లు పార్లమెంట్ లో పోరాడినట్లు జయప్రద పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios