‘జాతి రత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం‘జాతి రత్నాలు’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి ప్రేక్షకులు పడిపడి నవ్వారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ రాని క్రేజ్ తెచ్చుకుంది ‘జాతిరత్నాలు’. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఫిలిం ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో నవ్వులు పండించి, హిట్ టాక్ తెచ్చుకుంది.
‘పోలీసులు, చట్టాల పట్ల ఎలాంటి అవగాహన లేని ముగ్గురు అమాయక యువకుల కథ ఇది. ఓ పెద్ద నేరంలో చిక్కుకున్న వారు ఏ విధంగా బయటపడ్డారనే కథాంశంతో వినోదాన్ని పంచుతుంది. సమకాలీన అంశాలతో సాగే సెటైరికల్ ఎంటర్టైనర్గా ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న వాస్తవాల్ని సీరియస్గా కాకుండా కామెడీ జోడించి ఈ సినిమాలో చెప్పారు. జాతిరత్నాలుగా పిలవబడే ముగ్గురు యువకులు చేసే ప్రతి పని నుంచి బోలెడంత కామెడీ పుడుతుంది. నవీన్, రాహుల్రామకృష్ణ, ప్రియదర్శితో పాటు ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యముంటుంది.
సినిమా మొదటి రోజు కలెక్షన్స్:
నైజాం ఏరియాః 1.45 కోట్లు
సీడెడ్ః 55 లక్షలు
ఉత్తరాంధ్రః 50 లక్షలు
గుంటూరుః 39 లక్షలు
ఈస్ట్ః 29 లక్షలు
వెస్ట్ః 28 లక్షలు
కృష్ణః 25 లక్షలు
నెల్లూరుః 11 లక్షలు
మొత్తంః 3.82 కోట్లు