మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కెమెరాలకు దొరికిపోయింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కలిసి వెళ్లి.. విడివిడిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఇద్దరు ఎక్కడికి వెళ్లినట్టు.
బాలీవుడ్ లో.. ప్రేమలు.. పెళ్ళిళ్ళు .. డేటింగ్ లు చాటింగ్ లు.. లివింగ్ రిలేషన్ షిప్స్ ప్రస్తుతం చాలా కామన్. ఇదివరకు సీక్రేట్ గా లఫ్ ఏఫైర్స్ నడిపించేవారు తారలు. కాని ఇప్పుడు పబ్లిగ్ గా తిరుగుతూనే.. వాళ్ళ రిలేషన్ షిప్ ఏంటీ అనేది చెప్పకుండ కాన్ ఫ్యూజ్ చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం మేము ప్రేమికులం అని ఒప్పేసుకుని.. నచ్చింది రాసుకోండి.. ఇష్టమోచ్చినరట్టు చేసుకోండి డోంట్ కేర అన్నట్టు ఉటుంది. ఇక బాలీవుడ్ లో ఉన్న ప్రేమ జంటల్లో చాలా మంది పెళ్ళి చేసుకున్నారు. కొంత మంది బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఇఫ్పుడు తాజాగా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా బుక్ అయ్యింది అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన బాయ్ఫ్రెండ్తో కలిసి రీసెంట్ గా ముంబైలోని కలినా ఎయిర్పోర్టులో కనిపించింది. బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ఆమె ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ.. కెమెరాల కంట పడ్డారు. మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్కు హాజరైన జాన్వీతో పాటు ఆమె భాయ్ఫ్రెండ్ కూడా వచ్చాడు. వైట్ డ్రెస్సులో జాన్వీ దర్శనమిచ్చింది. ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే.. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది.
రీసెంట్ గా చాలా సార్లు షికారు చేస్తూ కనిపించారు జాన్వీ కపూర్.. ఆమ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్. వీళ్ళిద్దరూ...పబ్లిక్గా పలుమార్లు కనిపించారు. కానీ ఇప్పటి వరకు తమరిలేషన్ పై కాని.. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై కాని ఎటువంటి కామెంట్ చేయలేదు జంట. క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక శిఖర్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనువడే శిఖర్ పహరియా. జాన్వీ, శిఖర్ల మధ్య చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది. వాళ్లు ఎప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారు. మరి ఈ డేటింగ్ పెళ్ళి వరకూ వెళ్తుందా.. బోణీ కపూర్ ఏమంటాడు చూద్దాం.
