Asianet News TeluguAsianet News Telugu

#Devara జాన్వీ కు ఎంత ఇస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్

దేవర  సినిమా తర్వాత ఆమె సౌత్ లో ఫుల్ బిజీ అవుతుందని భావిస్తున్నారు. దాంతో అసలు ఈ సినిమా నిమిత్తం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

Janhvi Kapoor pockets highest paid in Tollywood? jsp
Author
First Published Jan 19, 2024, 8:58 AM IST


      ‘దేవర’తో తెలుగులోకి ‌ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ క్రమంలో  జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.  హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆమె సౌత్ లో ఫుల్ బిజీ అవుతుందని భావిస్తున్నారు. దాంతో అసలు ఈ సినిమా నిమిత్తం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

     మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు   ‘దేవర’చిత్రానికి ఆమెకు 10 కోట్లు పే చేస్తున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్స్ లో హైయిస్ట్ పేమెంట్ ఇదే కావటం విశేషం. పూజ హెగ్డే, రష్మిక, శ్రీలీల 4 కోట్లు దగ్గరే ఆగిపోతే వాళ్లందరినీ దాటి ఆమె 10 కోట్లులోకి వెళ్లింది. అయితే దేవర మొదట పార్ట్ గా రెండు పార్ట్ లకు కలిపా అనేది తెలియాల్సి ఉంది. అయితే రెండు పార్ట్ లకు కలిపి అంటున్నారు. అంటే ఒక్కో పార్ట్ కు 5 కోట్లు అందుకున్నట్లు అన్నమాట. 

     దేవర చిత్రాన్ని  ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మధ్య.. కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పి హైప్ ఎక్కించాడు. మునుపెన్నడూ లేని విధంగా దేవర ఉండబోతుంది అని, రికార్డులు గల్లంతే అని చెప్పుకొచ్చాడు. దీంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

    అలాగే ఈ సినిమా షూటింగ్‌‌ దశలో ఉండగానే మరో సౌత్‌‌ హీరోకు జంటగా ఆమె అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది. సూర్య హీరోగా బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్‌‌ ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.  మహాభారతం ఆధారంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌‌తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. పాన్‌‌ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో సూర్యకు జంటగా జాన్వీకపూర్‌‌‌‌ను ఎంపిక చేసినట్టు బాలీవుడ్‌‌ టాక్. ఇదే నిజమైతే జాన్వీ కెరీర్‌‌‌‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌ చేరినట్టే.  

      ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios