సారాంశం

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 25వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

 ఈరోజు ఎపిసోడ్లో అఖిల్ ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలో జెస్సి ఎక్కడికి వచ్చి అఖిల్ ఈరోజు నేను హాస్పిటల్ కి వెళ్ళాలి మంత్లీ చెకప్ చేయించుకోవాలి అనడంతో నాకు కుదరదు ఆఫీస్ లో వర్క్ ఉంది అనగా మరి నన్ను ఎవరు పిలుచుకొని వెళ్తారు అనగా మీ అక్క ఉంది కదా అని అంటాడు అఖిల్. ప్రతిదానికి అక్కని అడగడం బాగుండదు. అన్ని పనులు అక్కే చేస్తే మరి నువ్వు ఎందుకు ఉన్నావు. బయట తిరగడానికి మాత్రమే ఉన్నావా అని అంటుంది. ప్రతిసారి అక్కనే ఖర్చు పెడుతుంది అనడంతో పర్లేదు మా అన్నయ్య కదా సంపాదిస్తుంది అనడంతో మరి నీ పెళ్ళానికి నువ్వు ఖర్చు పెట్టావా నువ్వు సంపాదిస్తున్నావు కదా అని  నిలదీస్తుంది.

అప్పుడు నేను ఇప్పటినుంచి అక్కను పీల్చుకొని వెళ్లను అక్కని అడగను. నువ్వే అన్ని తీసి ఇవ్వాలి నువ్వే నన్ను పిలుచుకొని వెళ్లాలి అనడంతో సరే లంచ్ టైంలో వస్తాను కదా అప్పుడు వెళ్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు జానకి ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు రామచంద్ర రావడం చూసి జానకి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు జానకి టెన్షన్ పడుతూ ఉండగా రామచంద్ర గది తలుపులు వేస్తాడు. ఎందుకు రామాగారు అలా చూస్తున్నారు అనగా నేను మీకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా జానకి గారు, ఇప్పుడైనా నేను మీకు నిజం చెప్పకుండా ఉన్నానా అనగా ఇప్పుడు ఏమైంది రామా గారు అనగా మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు అని అంటాడు రామచంద్ర. నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది మీరు నాతో చెప్పడం లేదు అనగా జానకి నవ్వుతూ అలాంటిదేం లేదు రామా గారు అని అబద్ధాలు చెబుతుంది. 

మీరు ఏమీ లేనప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఉంటదిగా ఉంటున్నారు,హాస్పిటల్ కి వెళ్ళినప్పుడే మీ మీద నాకు అనుమానం వచ్చింది. మిమ్మల్ని అనుమానించడం అంటే అది నాకు నేను వేసుకున్న శిక్ష లాంటిది కానీ ఏమీ లేదు అన్నది అబద్ధం మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. ఏదో ఉంది ఈరోజు నాకు అది తెలియాలి అని అంటాడు రామచంద్ర. అప్పుడు ఏమీ లేదు అనగా రామచంద్ర తనపై ఒట్టు వేయించుకుని నిజం చెప్పమని జానకిని అడుగుతాడు. అప్పుడు జానకి ఏడుస్తూ జరిగింది మొత్తం వివరించడంతో రామచంద్ర షాక్ అవుతాడు. మా అమ్మ చనిపోవడం ఏంటి జానకి గారు ఇంత ప్రమాదంలో ఉంటే నా దగ్గర నిజం దాస్తారా అని ఏడుస్తూ మాట్లాడుతాడు రామచంద్ర.

అత్తయ్య గారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాను ఇందాక డాక్టర్ వాళ్ళు వచ్చినది నేను చెప్పింటే వచ్చారు. మనలో ఎవరికీ కిడ్నీ అయితే సరిపోతుందో వాళ్ళు కిడ్నీ ఇస్తే అత్తయ్య గారు బతుకుతారు మనం బ్రతికించుకుందాం అనడంతో రామచంద్ర తన తల్లితో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. జానకి ఊదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ కు కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమి తినకుండా ఇలా పూజలు చేయడం ఏంటమ్మా సమయానికి నాన్న పట్టుకున్నాడు కంటే సరిపోయింది అనగా అప్పుడు గోవిందరాజులు కూడా నేను అదే చెప్తున్నాను మీ అమ్మ నా మాట వినిపించుకోవడం లేదు అని అంటాడు.

 ఏమీ కాలేదు అంటుంది పోనీ జానకి తెచ్చిన టాబ్లెట్స్ వేసుకుందామంటే అవి కూడా పక్కన పడేసింది అని అంటాడు. ఇప్పుడు ఏమైందండీ ఆ బిల్లలు వేసుకోకపోతే నా ప్రాణం పోతుందా అనడంతో జానకి రామచంద్ర షాక్ అవుతారు. నేను బాగానే ఉన్నాను అని మందులు వాడాలంటే నా వల్ల కాదు అంటుంది జ్ఞానాంబ. అప్పుడు రామచంద్ర బాధపడుతూ మేమంతా నీకోసమే కదమ్మా ఆలోచించేది నీకోసమే కదా అనగా అప్పుడు రామచంద్ర మాటలకు జ్ఞానాంబ  ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. రామచంద్ర ఎమోషనల్ అవుతూ మేము తెచ్చిన మందులు వాడకుండా రేపు నీకు ఏదైనా అయితే మేము ఏమైపోవాలి అమ్మ అని అంటాడు.

మీ అమ్మ మందులు వేసుకోకపోతే ఏమవుతుంది ఏదైనా అవుతుంది అన్నట్లు ఎందుకు అలా ఏడుస్తున్నావు రాముడు అని అంటాడు గోవిందరాజులు. ఎప్పుడూ కండతడి పెట్టిన నువ్వు ఇంత చిన్న కారణానికే కంటతడి పెడుతున్నావు అంటే మా దగ్గర ఏదైనా నిజం రాస్తున్నావా అనడంతో రామచంద్ర అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటాడు. రామచంద్ర బయటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి రావడంతో జానకిని హత్తుకుని ఏమవుతుంది రామచంద్ర. ఏం కాదు రామ గారు మీరు ఈ టైంలో ధైర్యంగా ఉండాలి నేను కూడా ధైర్యంగా ఉంటాను. మనమే ఇలా అయితే ఎలా రామ గారు అని జానకి ధైర్యం చెబుతుంది. తర్వాత రామచంద్ర,జానకి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు.

 ఆ రిపోర్ట్స్ చూసి మా ఇంట్లో ఎవరి కిడ్నీ మా అమ్మకు సరిపోతుందో చెప్పండి డాక్టర్ అనడంతో సరే అని అంటుంది. అప్పుడు డాక్టర్ మీ కిడ్నీ అయితే మీ అమ్మకు బాగా సరిపోతుంది అనడంతో జానకి సంతోష పడుతూ ఉంటుంది. నా ఒంట్లో ఒక భాగం అత్తయ్య గారిని రక్షించడానికి ఉపయోగపడుతుంది అంటే నాకు అంతకుమించి ఏం కావాలి అనగా రామచంద్ర షాక్ అవుతాడు. రామచంద్ర ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మలయాళం బట్టలు ఇస్త్రీ చేసుకుంటుండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి పక్కకు తప్పు పోరా నా పంచ నేను ఐరన్ చేసుకుంటాను అనడంతో మీరు చేయలేరు అయ్యగారు నేను చెప్పినట్టు వినండి అనడంతో అప్పుడు వారిద్దరు సరదాగా వాదించుకుంటూ ఉంటారు.

అప్పుడు మీరు ఐరన్ చేస్తారా అనగా చేస్తాను అప్పుడు మలయాళం గోవిందరాజులు కళ్ళకి గంతలు కడతాడు. అప్పుడు గోవిందరాజులు తన పంచ అనుకుని తిలోత్తమ చీరను ఐరన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన మల్లిక  ఏంటి మామయ్య గారు మీరు చేస్తున్న పని అనడంతో తప్పడం లేదు మల్లిక నాకు ఎంతో ఇష్టమైన పనిని నేను చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు గోవిందరాజులు కి అసలు విషయం తెలియక నాకు మీ అత్తయ్య అంటే ఇష్టమే ఇది కూడా ఇష్టమే అనడంతో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మామయ్య గారు అంటుంది మల్లిక. అప్పుడు గోవిందరాజులు కళ్ల గంతులు తీసి ఒరేయ్ మళయాలం ఇంత పని చేస్తావా అని వాడిని చితకబాదుతూ ఉంటాడు. మరోవైపు రామచంద్ర హాస్పిటల్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జానకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు రామా గారు అని అంటుంది.