ప్రతీరోజు అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తోంది జేమ్స్. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో కెజిఎఫ్: చాప్టర్ 1 పేరు మీదున్న రికార్డులను ఇప్పుడు జేమ్స్ తుడిచి పెట్టేసింది.

క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ న‌టించిన చివ‌రి చిత్రం ‘జేమ్స్‌’. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రంకు స్పందన మామూలుగా లేదు. పునీత్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ‘జేమ్స్‌’ కూడా క‌న్న‌డ‌తోపాటు, తెలుగులోనూ విడుదల చేశారు. `జేమ్స్` ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తోంది. కన్నడ సినిమాకు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత రికార్డుల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. పునీత్ చివరి సినిమా కావడంతో థియేటర్స్ పోటెత్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా అభిమానులు అయితే ముందు రోజు రాత్రి నుంచి థియోటర్స్ కు చేరుకున్నారు. ఆయన్ని చివరి సారి స్క్రీన్ మీద చూడాలని గంటల పాటు థియేటర్స్ ముందు క్యూ కట్టారు.

ఈ చిత్రం 400 థియేటర్లలో రిలీజైంది. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. బాక్స్‌‌ఆఫీస్ వద్ద కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రతీరోజు అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తోంది జేమ్స్. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో కెజిఎఫ్: చాప్టర్ 1 పేరు మీదున్న రికార్డులను ఇప్పుడు జేమ్స్ తుడిచి పెట్టేసింది.

Scroll to load tweet…
Scroll to load tweet…

జేమ్స్ సినిమాను కేవలం కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా చూస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇది సినిమా కంటే కూడా ఫ్యాన్స్‌కి ఎమోషన్‌ గా చెప్తున్నారు. ఈ సినిమా అపూర్వ విజయం సాధించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి 5 రోజుల్లో 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

కాగా ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్‌‌గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ సోదరులు రాఘవేంద్ర, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో కనిపించారు.
 ఇక గత ఏడాది అక్టోబర్‌‌లో గుండెపోటుతో పునీత్ మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో జేమ్స్ మూవీ 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో పునీత్‌‌కి ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు.