ఒళ్లు గగుర్పొడిచేలా జేమ్స్ బాండ్ కొత్త ట్రైలర్
జేమ్స్ బాండ్ నుంచి కొత్త సినిమా `నో టైమ్ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్` సిరీస్లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్గా డానియల్ క్రేగ్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
`జేమ్స్ బాండ్` సినిమాల గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా `జేమ్స్ బాండ్` సిరీస్ అంతగా పాపులర్. ముఖ్యంగా `బాండ్.. జేమ్స్ బాండ్ 007` అని హీరో చెప్పే డైలాగ్ ఆడియెన్స్ ని ఉరకలెత్తిస్తుంది. ఈ బ్రిటీష్ కి చెందిన సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్.
తాజాగా ఈ సిరీస్ నుంచి కొత్త సినిమా `నో టైమ్ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్` సిరీస్లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్గా డానియల్ క్రేగ్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో, ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో ఈ ట్రైలర్ సాగింది. గతం ఇంకా గతించలేదని బాండ్ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో ఊహకందని యాక్షన్ ఘట్టాలు, బాండ్ గర్ల్స్ గ్లామర్, మిస్టీరియస్ కార్లు, అత్యాధునిక ఆయుధాలతో బాండ్ ట్రైలర్ ఎలా ఉండాలో, దాన్నిమించి తాజా సినిమా ట్రైలర్ ఉందని చెప్పొచ్చు. బాండ్ మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కార్ యాక్షన్ సీన్లు ఈ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి.
ఈ సినిమా నిజానికి ఏప్రిల్లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెల 20న అమెరికాలో విడుదల కానుంది. నవంబర్ 12న యూకేలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇది మన దేశంలో కూడా విడుదలకు ప్లాన్ జరుగుతుంది.మరి గత సినిమాల మాదిరిగానే ఇది ఆడియెన్స్ ని అలరిస్తుందా అనేది చూడాలి.