Asianet News TeluguAsianet News Telugu

రూ.200 కోట్ల స్కామ్ లో ఈడీ ముందుకు జాక్వెలిన్.. అతడితో ఫోన్ కాల్స్

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. ఇక బాలీవుడ్ కి, మాఫియాకి విడదీయరాని సంబంధం ఉంది.

Jacqueline Fernandez To attend before ED Today In 200 Crore Cheating Case
Author
Hyderabad, First Published Sep 25, 2021, 1:21 PM IST

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. ఇక బాలీవుడ్ కి, మాఫియాకి విడదీయరాని సంబంధం ఉంది. అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ. గతంలో చాలా మంది బాలీవుడ్ తారలు చాలా మాఫియా కేసుల్లో చిక్కుకున్న సంఘటనలు చూశాం.  

ఇదిలా ఉండగా కొన్ని వారాలుగా జాక్వెలిన్ వార్తల్లో నిలుస్తోంది. జాక్వెలిన్ కి 200 కోట్ల చీటింగ్ స్కామ్ లో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే ఘరానా మోసగాడు.. రాంబాక్సీ ప్రమోటర్స్ శివీందర్ సింగ్, మాల్విన్ దర్ సింగ్ లపై 200 కొట్ల భారీ చీటింగ్ కు పాల్పడ్డాడు. 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని చంద్రశేఖర్ భార్య లీనా పాల్ ఇన్వాల్వ్ చేసినట్లు విచారణలో అనుమానాలు రేకెత్తాయి. ఆగష్టు లో ఈ కేసుకు సంబంధించి చైన్నై లోని చంద్రశేఖర్ బంగ్లా, కార్లు, 85 లక్షల నగదుని సీజ్ చేశారు. 

చంద్రశేఖర్ పై అనేక కేసులు ఉన్నాయని. 17 ఏళ్ల వయసు నుంచే అతడు చీటింగ్స్ కి పాల్పడుతున్నట్లు రికార్డ్స్ ఉన్నాయని ఈడీ పేర్కొంది. చంద్రశేఖర్ జైలులో ఉన్నప్ప్పుడు జాక్వెలిన్ అతడితో ఫోన్ కాల్ ద్వారా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి కూపీ లాగేందుకు కొన్ని వారాల క్రితం ఈడీ జాక్వెలిన్ ని విచారించింది. మరిన్ని వివరాల కోసం నేడు ఈడీ ఆమెని మరోసారి ప్రశ్నించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios