‘ఎన్బీకే 108’ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. బాలయ్య సరసన తెలుగు బ్యూటీకి ఛాన్స్.!
నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ తదుపరి చిత్రం ‘ఎన్బీకే 108’. అనిల్ రావిపూడి దర్శకుడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై క్రేజీ అప్డేట్ అందింది.
పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మరియు కామెడీ చిత్రంగా బాలయ్య 108వ చిత్రం రూపుదిద్దుకోనుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎన్బీకే 108ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడంతో.. త్వరలోనే ‘ఎన్బీకే108’ షూట్ ను ప్రారంభించనున్నారు.
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగానే మారింది. అందులో వారి క్రేజ్ కు తగ్గ హీరోయిన్లను ఎంపిక చేయడం సాహసంగా మారుతోంది. ఇప్పటికే బాలయ్య 107 చిత్రంలో శృతి హాసన్ (Shruti Haasan)ను ఎంపిక చేయగా.. NBK108లో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. బాలయ్య సరసన నటించేందుకు తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar)ను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంతకముందే నయనతారను సెలెక్ట్ చేశారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం నయన్ ఫ్యామిలీకే టైం కేటాయించడంతో ఆ ఛాన్స్ తెలుగు హీరోయిన్ కి దక్కిన్టట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోకి చాలా మంది హీరోయిన్లను తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి లీడ్ యాక్ట్రెస్ గా నటిస్తోందని, ప్రియాంక జవాల్కర్ మరో హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. మరోపాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా నటించబోతోంది. మరో హీరోయిన్ కూ అవకాశం ఉందని బజ్ క్రియేట్ అయ్యింది. డిసెంబర్ 8న షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కాబోతోంది. జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. చిత్రానికి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.