బాలీవుడ్ లో మన తెలుగు కథలతో తెరకెక్కిన రీమేక్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఆ మధ్య జెర్సీ రిలీజ్ అవ్వగా.. అది ప్లాప్ టాక్ తెచ్చకుంది. ఇక ఇప్పుడు హిట్ రీమేక్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చశారు టీమ్.
టాలీవుడ్ యంగ్ స్టార్ విశ్వక్ సేన్ హీరోగా సైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్. టాలీవుడ్ నేచ్యురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈసినిమా భారీ సక్సెస్ సాధించింది. టీమ్ అందరికి మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు హిందీలో రీమేక్ మూవీ తయారు అవుతోంది. హిట్ టైటిల్ తో హీందిలో రీమేక్ చేశారు. ఈమూవీకి సంబంధించిన పనులు కూడా పూర్తి అయ్యాయి.
రాజ్కుమార్ రావు, సన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈసినిమాను.. తెలుగులో ఒరిజినల్ వెర్షన్ మూవీని తెరకెక్కించిన సైలేష్ కొలను.. రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. చాలా కాలం కరోనా వల్ల ఈమూవీ డిలై అవుతూ వస్తోంది. ఇక ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
ఈసినిమాను జూలై 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో రాజ్కుమార్ ఇంటెన్సీవ్ లుక్స్తో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం గత నెల 20న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. విక్రమ్ పాత్రలో రాజ్కుమార్ రావు నటించాడు.
రిలీజ్ డేట్ ఇచ్చేయడంతో.. సినిమా ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు టీమ్. ఈ మూవీలో హీరో పాత్ర అయిన విక్రమ్ గ్లింప్స్ను జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషన్ కుమార్తో కలిసి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు సంయుక్తంగా నిర్మించాడు