Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ కళ్యాణ్‌, రానాలకు క్రేజీ హీరోయిన్లు ఫిక్స్..?

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నటించే మల్టీస్టారర్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. క్రేజీ హీరోయిన్లని చిత్ర బృందం ఎంపిక చేసిందట. 

heroins fix in pawan kalyan and rana starrer ayyappanum koshiyum remake arj
Author
Hyderabad, First Published Jan 17, 2021, 9:49 AM IST

పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆ మధ్య ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో పవన్‌, రానా ఒకరిపై ఒకరు గొడవ పడబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఆద్యంతం ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఐశ్వర్యా రాజేష్‌, సాయిపల్లవిని అనుకుంటున్నారట. సాయిపల్లవి ప్రస్తుతం రానాతో `విరాటపర్వం`లో నటిస్తుంది. దీంతో ఇదే కాంబినేషన్‌ని రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు పవన్‌తో ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తారని సమాచారం. 

ఇక మలయాళంలో బిజూ మీనన్‌, పృథ్వీరాజ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్ర రీమేక్‌లో బిజూ మీనన్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌, పృథ్వీరాజ్‌ పాత్రలో రానా నటించనున్నారు. ఈ సినిమా కోసం పవన్‌ నలభై రోజుల డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. దీన్ని త్వరగా పూర్తి చేసి హరీష్‌ శంకర్‌ సినిమాని స్టార్ట్ చేయనున్నారట. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అల్లూమినియం ఫ్యాక్టరీలో ఓ పెద్ద సెట్‌ వేశారు. ఇందులోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. మరోవైపు ఈ సినిమాకి `బిల్లా రంగా` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios