టీచర్ అవతారం ఎత్తిన హీరోయిన్ నిత్య మీనన్, వైరల్ అవుతున్న వీడియో
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటే.. మరికొంత మంది రిజర్వ్ గా ఉంటారు. మరికోంత మంది సామాన్యుల్లో కూడా కలిసిపోతుంటారు. అలాంటి వారిలో నిత్యా మీనన్ కూడా ఒకరు.
అందరిలో కలిసిపోతుంది హీరోయిన్ నిత్యా మీనన్. తను స్టార్ అన్న భావన మనస్సులో లేకుండా మెలుగుతుంది. అవ్వడానికి ఆమె మలయాళ హీరోయిన్ అయినా.. తెలుగించి ఆడపడుచులా కనిపిస్తుంది. మొదటి సినిమా నుంచే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంది బ్యూటీ. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించుకుంది నిత్యా మీనన్.
నిత్యా మీనన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. అక్కడి వారితో కలిసిపోయి.. వారి ఇంటి మనిషిగా ప్రవర్తిస్తుంటుంది. షూటింట్ స్పాట్ లో కూడా చుట్టుపక్కల వారితో నార్మల్ గా ఉంటుంది. సెలబ్రెటీని అని ఫోజు కొట్టకుండా కలిసిపోతుంది. ఈక్రమంలో రీసెంట్ గా షూటింగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాపురం వెళ్లిన నిత్యామేనన్.. అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లింది. మలయాళ మాతృభాష కలిగిన నిత్యా మీనన్ అక్కడి పిల్లకు తెలుగు పాఠాలు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది నిత్య.
ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. తన కొత్త ఏడాది షూటింగ్ ఇలా జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలామంది నిత్యా మీనన్ ను తెగ మెచ్చుకుంటున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ.. ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందో అని నిత్యను చూసి ముచ్చట పడుతున్నారు. నిత్యామేనన్.. మలయాళీ కాదు తెలుగమ్మాయి అని కలిపేసుకుంటున్నారు.
మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిత్యామేనన్, అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గాటాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కోట్టిన నిత్యా.. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకోవడం మాత్రమే కాదు సాంగ్ కూడా పాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎక్స్ పోజింగ్ అన్నా.. స్కిన్ షో అన్నా నో చెప్పే నిత్యామేనన్..తన హద్దులుదాటి ఎప్పుడూ సినిమాల్లో నటించలేదు. అందుకే తనకునచ్చినట్టుగా మంచి సినిమాలు ఎంపిక చేసుకుని తక్కువ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. చివరగా భీమ్లా నాయక్ సినిమాలో లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జోడీగా నటించిన నిత్యా మీనన్. తమిళ మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.