లక్ అంటే ఇదే... కెజిఎఫ్ నిర్మాతలతో కీర్తి సురేష్ కొత్త చిత్రం!
కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ఖాతాలో వేసుకున్నారు. కెజిఎఫ్ నిర్మాతలు ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై నేడు అధికారిక ప్రకటన జరిగింది.
స్టార్ లేడీ కీర్తి సురేష్ కొత్త చిత్రాల ప్రకటనలో జోరు చూపిస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాతలతో ఆమె చేయి కలిపారు. కీర్తి ప్రధాన పాత్రలో రఘు తాథా(రగ్ తాథా) టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకుడు. సుమన్ కుమార్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్లు ది ఫ్యామిలీ మాన్, ది ఫ్యామిలీ మాన్ 2 లకు రచయితగా పని చేశారు. రఘు తాథా మూవీతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు సమాచారం. హోంబ్లే పిక్చర్స్ ఫస్ట్ తమిళ చిత్రంగా ఇది రూపొందుతోంది.
ఇక పోస్టర్ లో కీర్తి లుక్ చూస్తే ఆమె పోరాట యోధురాలిగా కనిపిస్తున్నారు. ఇది స్త్రీ సాధికారత కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న చిత్రమని క్లియర్ గా అర్థం అవుతుంది. ఉద్యమం ఇంటి నుండే మొదలవుతుందనే ఒక ఇంట్రెస్టింగ్ కోట్ కూడా పోస్టర్ పై చూడొచ్చు. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కీర్తి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఆమె ఖాతాలో మరో చిత్రం వచ్చి చేరింది.
మహానటి మూవీ భారీ విజయం సాధించింది. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంలో కీర్తి నటన అబ్బురపరిచింది. ఆమెకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అప్పటి నుండి కీర్తి వరుసగా పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు. అయితే సక్సెస్ అయ్యింది తక్కువ. అమెజాన్ ఒరిజినల్ 'చిన్ని' మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
— Keerthy Suresh (@KeerthyOfficial) December 4, 2022
ప్రస్తుతం కీర్తి తెలుగులో భోళా శంకర్, దసరా చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో కీర్తి చెల్లి పాత్ర చేస్తున్నారు. ఇక నానికి జంటగా తెరక్కుతున్న దసరా చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. పాన్ ఇండియా చిత్రంగా దసరా ఐదు భాషల్లో విడుదల కానుంది.