Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరోయిన్ త్రిష.. కారణం!

హీరోయిన్ త్రిష మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా ప్రాంతంలో గల ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె పూజలు నిర్వహించడం వెనుక పెద్ద ఆలోచనే దాగుంది. 

heroin trisha performs special pooja this is why
Author
Hyderabad, First Published Aug 23, 2021, 10:22 AM IST


స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలిన త్రిష ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమెకు డిమాండ్ తగ్గినా, తమిళంలో ఆమెకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. మరోవైపు ఆమె గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లిన త్రిష అక్కడ ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నియిన్ సెల్వమ్ మూవీ ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి కావాలని, అలాగే మంచి విజయం సాధించాలని త్రిష దేవుణ్ణి కోరుకున్నారట. 


కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం పొన్నియిన్ సెల్వన్ టీమ్ మధ్యప్రదేశ్ లోని ఓర్చా అనే ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ నందు హీరో కార్తీ, త్రిష, ప్రకాష్ రాజ్ వంటి నటులు పాల్గొంటున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే మరికొన్ని రోజులు వివిధ లొకేషన్స్ లో పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ జరుపుకోనుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మొదటి పార్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. 

కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విక్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, పార్తీబన్ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios