Asianet News TeluguAsianet News Telugu

తన పెళ్లికి ఆహ్వానిస్తూ.. ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసిన శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ తో కనిపించారు. 
 

Hero Sharwanand met MP Santhosh Kumar to invite for his wedding NSK
Author
First Published May 30, 2023, 8:28 PM IST

టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand)  రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో కారు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శర్వాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తర్వలో శర్వానంద్ పెళ్లి వేడుక ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వెడ్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. 

ఈ సందర్భంగా తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు. తన వివాహానికి హాజరు కావాలని శుభలేకతో ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సెలబ్రెటీలతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఎంపీ సంతోష్ శర్వాను బాగా రిసీవ్ చేసుకొని, ఆహ్వానానికి సంతోషించినట్టు తెలుస్తోంది. 

ఇక శర్వానంద్ యూఎస్ బేస్ట్ టేకీ రక్షిత రెడ్డి (Rakshita Reddy) ని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ పసునూరి మధుసూదన్ రెడ్డి కూతురే రక్షిత రెడ్డి. వీరి ఎంగేజ్మెంట్ జనవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో శర్వా - రక్షిత వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. అక్కడ రెండు రోజుల పాటు మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ , ఇతర ఈవెంట్లను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. వీరి పెళ్లికి దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారని టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios