Asianet News TeluguAsianet News Telugu

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ సిద్ధార్థ్‌.. నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న యంగ్‌ హీరో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. తాజాగా నారా లోకేష్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోవడం విశేషం. 
 

hero nikhil entry into politics he joined TDPin the presence of nara lokesh arj
Author
First Published Mar 29, 2024, 11:19 PM IST

ఎలక్షన్లు వచ్చిప్పుడు రాజకీయాలు రంజుగా మారతాయి. నాయకులు ఆపార్టీ నుంచి ఈ పార్టీకి షిఫ్ట్ అవుతుంటారు. వేగంగా జంపింగ్‌లు చోటు చేసుకుంటాయి. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఎన్నికలను క్యాష్‌ చేసుకుని పదువులు పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇది కొన్ని ఏళ్లుగా సాగుతున్నదే. ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

హీరోగా భారీ సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్‌.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ, అలాగే దేశంలో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీ(తెలుగు దేశం పార్టీ)లో చేరడం విశేషం. నారా లోకేష్‌ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. ఈ మేరకు లెటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. హీరోగా బిజీగా ఉన్న నిఖిల్‌ ఈ సడెన్‌ నిర్ణయం చర్చనీయాంశంగా మారుతుంది. 

అయితే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ప్రచారం కోసమే ఆయన పార్టీ కండువా కప్పుకున్నానే ప్రచారం కూడా జరుగుతుంది. ఏం జరగబోతుందనేది, నిఖిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజీపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ప్రస్తుతం నిఖిల్‌.. `స్వయంభు` చిత్రంలో నటిస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్‌ హీరోయిన్ నటిస్తుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో నిఖిల్‌ యుద్ధ విద్యలు తెలిసిన యోధుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ కూడా యాక్షన్‌ చేస్తుంది. ఈ మేరకు ఆమె యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవడం విశేషం. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల `కార్తికేయ 3`ని కూడా ప్రకటించారు నిఖిల్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios