స్టార్ డైరెక్టర్ తో గోపీచంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. కన్ఫమ్ చేసిన దర్శకుడు.. డిటేయిల్స్.!
టాలీవుడ్ డైనమిక్ అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) నెక్ట్స్ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ఫైనల్ చేశారు. పండగ సందర్భంగా ఈ క్రేజీ కాంబోను అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ డైనమిక్ అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ పెద్దగా సినిమాలు మాత్రం విజయవంతం కావడం లేదు. గతేడాది ‘సీటీమార్’ చిత్రంతో కాస్తా మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’,‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై గోపీచంద్ మరింత శ్రద్ధా పెట్టారు. తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ తో కన్ఫమ్ చేశారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla)తో గోపీచంద్ నెక్ట్స్ ఫిల్మ్ ను ఒకే చేశారు. కామెడీ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీనువైట్ల దర్శకత్వంతో గోపీచంద్ నటించబోతుండటంతో తప్పకుండా హిట్ కొడుతారని భావిస్తున్నారు. శ్రీను వైట్ల - గోపీచంద్ కాంబినేషన్ ఓకే అయ్యింది. ఇదే విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల దసరా పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘ఈ పవిత్రమైన రోజున, నా తదుపరి చిత్రాన్ని గోపీచంద్ తో ప్రకటించడం సంతోషంగా ఉంది. అలాగే నా చిరకాల మిత్రుడు, రచయిత గోపీమోహన్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యారు. ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం.
మీ ప్రేమకు ఆశీస్సులు, ధన్యవాదాలు కోరుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్ షా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను టాలీవుడ్ కు అందించిన దర్శకుడు శ్రీనువైట్ల కొన్నేండ్లుగా కాస్తా జోరును తగ్గించారు. మళ్లీ సరికొత్త ప్రాజెక్టులను రెడీ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు సిద్ధం అవుతున్నారు. చివరిగా రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో అలరించాడు. ప్రస్తుతం గోపీచంద్ తో న్యూ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇక గోపీచంద్ కూడా టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఆ వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నారు.