అందరి మనసు దోచుకుంటున్న అల్లు శిరీష్
అల్లు శిరీష్ తన ఇన్ స్టా అకౌంట్ లో చేసిన పోస్ట్ అందరి మనసుల్ని దోచుకుంటూ వైరల్ అవుతుంది. శిరీష్ తన సిబ్బందితో క్యారమ్ బోర్డ్ ఆడుతూ, నా ఆఫీసులో వర్క్ ముగిసిన వెంటనే నేనే చేసే పని క్యారమ్స్ ఆడటం అంటూ ఓ ఫొటోని అప్ లోడ్ చేశారు.
సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచాడు హీరో శిరీష్. హీరోలు అంటే మరో లోకంలో ఉంటారనే భేదభావాల్ని సంపూర్ణంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, నేటి తరం హీరోలు, తమ చుట్టూ ఉన్నవారితో, తమకు పని చేసే సహాయక సిబ్బందితో కలిసి మెలిసి ఉంటున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన ఇన్ స్టా అకౌంట్ లో చేసిన పోస్ట్ అందరి మనసుల్ని దోచుకుంటూ వైరల్ అవుతుంది. శిరీష్ తన సిబ్బందితో క్యారమ్ బోర్డ్ ఆడుతూ, నా ఆఫీసులో వర్క్ ముగిసిన వెంటనే నేనే చేసే పని క్యారమ్స్ ఆడటం అంటూ ఓ ఫొటోని అప్ లోడ్ చేశారు. గతంలో కూడా తన అన్న అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ లో కూడా చాలా వినయంగా మాట్లాడి అప్పుడు కూడా అందరి మన్ననలు పొందాడు.
ప్రస్తుతం శిరీష్, అను ఇమానుయెల్ జంటగా నటించిన ప్రేమ కాదంట అనే న్యూ ఏజ్ లవ్ స్టోరీ రిలీజ్ కి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన వ్యవహరాల్లోనే శిరీష్ బిజీగా ఉన్నాడు. రాకేష్ శశి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఇక హీరోగా శిరీష్ కి ఇంకా సక్సెస్ దక్కలేదు. ప్రేమ కాదంట మూవీతో అయినా క్లీన్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి. ఇటీవల విడుదలైన ప్రేమ కాదంట మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.