Asianet News TeluguAsianet News Telugu

వంద కోట్ల హీరో అల్లు అర్జున్ చేయాల్సిన పనేనా అది... సంచలన ఫోటో వైరల్ 


అల్లు అర్జున్ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్టార్ హీరో చేసిన పని సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అల్లు అర్జున్-స్నేహ రెడ్డిల ఫోటో వైరల్ అవుతుంది. 
 

hero allu arjun proves his simplicity once again had lunch at road side hotel ksr
Author
First Published May 21, 2024, 7:09 PM IST

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. పుష్ప మూవీ ఆయన రేంజ్ మార్చేసింది. నార్త్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ''పుష్ప పుష్ప'' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. రికార్డు వ్యూస్ రాబట్టింది. దర్శకుడు సుకుమార్ పుష్ప సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

2021లో విడుదలైన పుష్ప అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 80 కోట్లు అని సమాచారం. గతంలో ఆయన రూ. 30 కోట్లు కంటే తక్కువ తీసుకునేవారు. దాదాపు సినిమాకు వంద కోట్లు ఛార్జ్ చేస్తున్న అల్లు అర్జున్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఇది మరోసారి రుజువైంది. 

మే 11న అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి మద్దతు తెలిపేందుకు ఆయన భార్య స్నేహారెడ్డితో పాటు వెళ్లారు. నంద్యాల నుండి తిరిగి హైదరాబాద్ బయలు దేరిన అల్లు అర్జున్ మధ్యలో ఓ సాధారణ దాబాలో భోజనం చేశారు. సామాన్యుడు వలె కనీస సౌకర్యాలు లేని రోడ్డు పక్క దాబాలో అల్లు అర్జున్ భోజనం చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ సింప్లిసిటీని కొనియాడుతున్నారు. 

ఆ మధ్య పుష్ప 2 షూటింగ్ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగింది. ఉదయాన్నే తన సిబ్బందితో పక్కనే ఉన్న పల్లెటూరి హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. కాగా అల్లు అర్జున్ నెక్స్ట్ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా సమంత హీరోయిన్ గా ఎంపికైంది అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios