Asianet News TeluguAsianet News Telugu

ఆగిపోయిన సినిమాపై స్పందించిన అడివి శేష్.. మూడేండ్ల తర్వాత క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.!

మూడేండ్ల కింద గ్రాండ్ గా ప్రారంభమై ఆగిపోయిన చిత్రంపై యంగ్ హీరో అడివి శేష్ తాజాగా స్పందించారు. సినిమా ఆగిపోవడానికి కారణమేంటో తెలియజేస్తూ.. ఆ మూవీతో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతున్నారో క్లారిటీ ఇచ్చాడు.
 

Hero Adivi Sesh reacted to the film which stopped after three years!
Author
First Published Nov 30, 2022, 4:40 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం తెలుగు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో అదరగొడుతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ యువతరం హీరోల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ‘క్షణం’,‘గూఢాచారి’ రీసెంట్ గా మేజర్ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తున్న ‘హిట్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ గతంలో గ్రాండ్ గా ప్రారంభమై ఆగిపోయిన చిత్రం గురించి స్పందించారు. బాలీవుడ్  లో అర్జున్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘టూ స్టేట్స్’. 2014లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి తెలుగు రీమేక్ 2019లో ప్రారంభమైంది. డెబ్యూ దర్శకుడిగా కుంచం వెంకట్ రెడ్డి,  హీరోహీరోయిన్లుగా అడివి శేష్ - శివానీ రాజశేఖర్ (Shivani) (రాజశేఖర్ కూతురు), బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, తదితర తారాగణంతో సినిమా మొదలైంది. లక్ష్య ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా సినిమాను నిర్మించ తలపెట్టాయి.

అయితే, సినిమా ప్రారంభమైన ఏడాది తర్వాత కూడా ఎలాంటి అప్డేట్స్ అందలేదు. ఆ తర్వాత సినిమా మళ్లీ ప్రారంభం కాలేదు.  అయితే సినిమా ఆగిపోవడానికి కారణం.. ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.  మూడేండ్ల తర్వాత తాజాగా అడివి శేష్ అసలు విషయాన్ని బయటపెట్టారు.  ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం డైరెక్టరే. తనేం చేస్తున్నాడే తనకే తెలిసేది కాదు. సెట్ లోని ఆర్టిస్ట్ లు, తనపైనా అనవసరంగా నోరుపారేసుకున్నాడు. దీంతో సినిమాను ఆపేశాం. అప్పటికే ప్రొడ్యూసర్స్ జరిగిన ఆర్థిక నష్టాన్ని తన సినిమాల్లో షేర్ ఇస్తూ పూడ్చుతున్నానని తెలిపారు. దీని నుంచి తేరుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టిందన్నారు.’

ఇక అడివి శేష్ 2 స్టేట్స్ మూవీ ప్రారంభంలో స్క్రిప్ట్ లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యేవాడట.. దీంతో తనకు తగ్గట్టు మార్పులు చేయమని సూచించాడం. శేష్ చెప్పేది డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో.. వీరిద్దరి మధ్య క్లాష్‌ ఏర్పడింది.  దీంతో అడివి శేషు సినిమా చేయనని చెప్పడంతో.. నిర్మాత ఆపేశాడని అప్పట్లో టాక్ వినిపించింది. మరో డైరెక్టర్ తో సినిమాను కొనసాగించే ప్రయత్నం చేసినా కుదరకపోయింది. ఫలితం సినిమా పూర్తిగా ఆగిపోయిందని ప్రచారం. ప్రస్తుతం అడివి శేష్ దీనిపై కామెంట్స్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios