యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ యాడ్ ఫిల్మ్ చూశారా? ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రారంభానికి ఇంకా సమయం పడుతుండటంతో.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్లు చేస్తున్నారు. రీసెంట్ గా తారక్ చేసిన యాడ్ ఫిల్మ్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) రేంజ్ అంతర్జాతీయంగా పెరిగింది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్ బేస్ ఉన్న తారక్ కు విశేషంగా అభిమానులు ఏర్పడ్డారు. దీంతో తారక్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ పూర్తై ఇప్పటికీ ఏడాది పూర్తైనా మరో ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్లడం అంతకంతకూ ఆలస్యమే అవుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు క్లాథింగ్, మార్కెటింగ్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్లలో నటిస్తున్నారు. ఇటీవల రెండు యాడ్ షూట్లలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి రీసెంట్ విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన లైషియస్ (Licious) కోసం యాడ్ షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, రాహుల్ రామక్రిష్ణ తో కోర్టు లో చేసిన సీన్ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు మురిసిపోతున్నారు. అప్ కమింగ్ ఫి ల్మ్స్ ఆలస్యం అవుతుండటంతో.. కనీసం ఇలానైనా ఎన్టీఆర్ దర్శనం కలగడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ కు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ ఇలా యాడ్ షూట్ లో దర్శనమిస్తున్నారు. అయితే, ఇందుకు తారక్ భారీగానే ఛార్గ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లైషియస్ బ్రాండ్ యాడ్ షూట్ కోసం రూ.3.50 కోట్ల వరకు తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 31’లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది.