గోపీచంద్ ప్రస్తుతం `రామబాణం' చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ తరువాతి సినిమా కూడా లైన్ లో పెట్టాడు.
ఇప్పుడు అందరి దృష్టీ కన్నడ దర్శకులుపై పడింది. ప్రశాంత్ నీల్ సూపర్ హిట్ కేజీఎఫ్ ఇచ్చాక కన్నడ సినిమాలంటే తెలుగువారికి ఆసక్తి ఏర్పడింది. కన్నడ వారు చేసే మాస్ సినిమాలుని తెలుగులోనూ చేయాలనుకుంటున్నారు. దాంతో కన్నడ,తెలుగు మార్కెట్ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కన్నడ దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ చిత్రం చేయబోతున్నారని విషయం తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు గోపీచంద్ సైతం ఓ కన్నడ దర్శకుడుతో సినిమా చేయబోతున్నారు.
గోపీచంద్ ప్రస్తుతం `రామబాణం' చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ తరువాతి సినిమా కూడా లైన్ లో పెట్టాడు. కన్నడ దర్శకుడు హర్షతో ఆయన ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. హర్ష ఇటీవల శివరాజ్ కుమార్తో 'వేద' అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో ఇది పెద్ద హిట్. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయ్యింది.అయితే జనాదరణ కరువైంది. కానీ అదే రోజున ఓటిటిలో కూడా రిలీజ్ అవటంతో ఈ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు.
కానీ కన్నడలో వచ్చిన ఫీడ్ బ్యాక్ తో.. వెంటనే గోపీచంద్ హర్షతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అందుతున్న సమాచారం మేరకు మార్చి 3న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గోపీచంద్కి అలాంటి కథలు బాగా సూటవుతాయని నమ్మి చేస్తున్నారు. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
