Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ మలినేని అన్న ఆ మాట...ఇప్పుడు వైరల్

డార్లింగ్ ప్రభాస్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అది ఫైనల్ స్టేజీలో ఉందని చెప్పటం వైరల్ అయ్యింది.

Gopichand narrated a line to prabhas while Final discussions are still on
Author
First Published Jan 21, 2023, 6:05 PM IST

సంక్రాంతి హిట్  ‘వీరసింహారెడ్డి’తో బాలయ్యని మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసిన గోపీచంద్, ప్రస్తుతం ఫుల్ ఖుషీలో  ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపికి నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే క్వశ్చన్ ఎదురైంది. దీనికి సమాధానం చెబుతూ.. డార్లింగ్ ప్రభాస్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అది ఫైనల్ స్టేజీలో ఉందని చెప్పటం వైరల్ అయ్యింది.

2021 లో రవితేజ తో క్రాక్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు  మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . ఈసినిమాతోనే ఎప్పటినుండో వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్న రవితేజకు కూడా సూపర్  హిట్ దక్కింది. ఇక క్రాక్ తరువాత గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తీశాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిన ఈసినిమా సంక్రాంతికి  మంచి టాక్ తెచ్చుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పోటీ పడుతూ...బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దాంతో ఈసినిమాతో గోపీచంద్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని హాట్ టాపిక్ గా మారారు.

ఈ నేపధ్యంలో ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేస్తాడా అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం చర్చల్లో ఉన్నానని తెలిపాడు. అంతేకాదు ఇంకా అనేకమంది హీరోలతో కూడా చర్చల్లో ఉన్నానని.. ముందు స్క్రిప్ట్ ను పూర్తి చేసిన తరువాత హీరోను ఎంపిక చేస్తానని చెప్పాడు. అయితే ముందు కొద్దిరోజులు బ్రేక్ తీసుకొని ఆతరువాత తన తరువాత ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తానని తెలిపాడు. అయితే ప్రభాస్ కనుక   ఓకే అయితే ఒక క్రేజీ కాంబినేషన్ అవుతుంది. అయితే ప్రభాస్ కు ఉన్న లైనప్ లో ఎక్కడ చోటు ఉంది. చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios