అది అసత్య ప్రచారం, నెక్స్ట్ మూవీ ఆయనతోనే: గోపీచంద్ మలినేని
బలుపు, పండగ చేస్కో లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ దర్శకుడు తెరకెక్కించిన చివరి చిత్రం విన్నర్. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నుంచి మరో చిత్రం రాలేదు.
బలుపు, పండగ చేస్కో లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ దర్శకుడు తెరకెక్కించిన చివరి చిత్రం విన్నర్. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నుంచి మరో చిత్రం రాలేదు.
దీనితో గోపీచంద్ తదుపరి మూవీ గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. సాయిధరమ్ తేజ్ తోనే మరో చిత్రం ఉంటుందని, రవితేజని డైరెక్ట్ చేయబోతున్నాడని అనేక ఊహాగానాలు వినిపించాయి. నాగార్జునతో ఓ చిత్రం ఖరారైపోయిందని లేటెస్ట్ గా ప్రచారం జరిగింది. దీనిపై గోపించంద్ స్పందించాడు. తన తదుపరి చిత్రం గురించి వెబ్ సైట్లలో వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపాడు.
తన నెక్స్ట్ మూవీ రవితేజతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నట్లు గోపీచంద్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనునట్లు గోపించంద్ తెలిపాడు.