Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ టెన్షన్..ఈసారైనా రిలీఫ్ వస్తుందా?

మధ్యలో రెండు మూడు సార్లు ఇదిగో విడుదల అంటూ ప్రకటనలు వచ్చాయి కానీ.. విడుదల కాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అంటూ కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి చిత్రయూనిట్‌ నుంచి రిలీజ్‌ ప్రకటన వచ్చింది. 

Gopichand Aaradugula Bullet Getting Ready To Release jsp
Author
Hyderabad, First Published Jun 21, 2021, 10:52 AM IST

కొన్ని సినిమాలు ఏ మూహుర్తాన మొదలవుతాయో కానీ రకరకాల అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. రిలీజ్ లు లేటు అవుతూంటాయి. గోపీచంద్ సినిమాకు అదే సమస్య. గోపీచంద్ హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా.. బి. గోపాల్‌ దర్శకత్వంలో.. అప్పుడెప్పుడో షూటింగ్ జరుపుకున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయ బాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. 

మధ్యలో రెండు మూడు సార్లు ఇదిగో విడుదల అంటూ ప్రకటనలు వచ్చాయి కానీ.. విడుదల కాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అంటూ కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి చిత్రయూనిట్‌ నుంచి రిలీజ్‌ ప్రకటన వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ సారైనా బుల్లెట్ దిగుతుందా..గోపిచంద్ సినిమా రిలీజ్ అవుతుందా అని అంటున్నారు. గోపీచంద్ సైతం టెన్షన్ గా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే మీడియావాల్లలలు కలిసినప్పుడల్లా ఈ సినిమా ప్రస్తావన వస్తోంది. తన చేేతిలోో లేని విషయమై ఏమీ చెప్పలేని పరిస్తిది ఏర్పడుతోంది.

 ఈ సినిమా రిలీజ్ అయ్యితే బాగుండును అని దేవుళ్లకు మ్రొక్కుకుంటున్నాడట.  మరి ఈసారైనా ఈ చిత్ర విడుదల అవుతుందో లేదో తెలియదు కానీ.. థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేస్తామని, చిత్రాన్ని నిర్మాత తాండ్ర మహేష్‌ ఓన్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లుగా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. వ‌క్కంతం వంశీ క‌థ‌ అందించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios