సమంత ‘ఊ అంటావా మావ’ సాంగ్ సింగర్ కు గోల్డ్ మెడల్.. ప్రజాదరణ పొందిన సింగర్ గా గుర్తింపు..
బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుష్ప : ది రైజ్’ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా ‘ఊ అంటావ మామ.. ఊఊ అంటావా’ సాంగ్ సింగర్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ‘పుష్ప’ (Pushpa) చిత్రాన్ని దర్శకుడు సుకుమర్ డైరెక్ట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) జీవించారు. బన్ని జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో మెరిసింది. ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని భాషల్లో దుమ్ము రేపింది. ప్రధానంగా ఈ చిత్రంలో సాంగ్స్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దేవీ శ్రీ ప్రసాద్ అంచిన చార్ట్ బస్టర్ కు సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. ఈ చిత్రంలో ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.
ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ సమంత (Samantha) స్పెషల్ నెంబర్ లో కనిపించింది. తొలిసారిగా సామ్ ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’లో నటించడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త రికార్డులనూ క్రియేట్ చేసిందీ సాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కు క్యాచీ ట్యూన్ అందించారు. సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహౌన్ అద్భుతంగా పాడారు. మాస్ లిరిక్స్ కు, ఇంద్రావతి చక్కటి గాత్రం అందించడంతో సాంగ్ జనాల్లోకి ఈజీగా దూసుకెళ్లింది. ప్రస్తుతం 250 మిలియన్ల వ్యూస్ తో వీడియో సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతోంది.
కాగా, సింగర్ ఇద్రావతి చౌహాన్ కు ఈ సాంగ్ పాడినందుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూడ్ బిహైండ్ వుడ్ సంస్థ ఈ ఏడాదితో 19 ఏండ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22న సంస్థ యానివర్సరీ సెలబ్రేషన్స్ ను చెన్నై ఐలాండ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా 2022లో అత్యధికంగా ప్రజాదరణ పొందిన సినిమాలు, బెస్ట్ యాక్టర్స్, సింగర్స్ కు గోల్డ్ మెడల్ ను ప్రదానం చేయనున్నారు సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంగా ఇంద్రావతి పాడిన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో బిహైండ్ వుడ్.. గోల్ మెడల్ ను ప్రకటించింది. ఇందుకు ఆమె ఆనంద వ్యక్తం చేస్తూ.. దేవీ శ్రీ ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.