మాస్‌ కా దాస్‌ ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ విషయంలో టీమ్‌ ప్లాన్‌ అదిరిపోయింది.   

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల `గామి` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇది పెద్దగా ఆడలేదు. ప్రయోగాత్మక చిత్రాలు జాబితాలో చేరింది. సిటీ ఆడియెన్స్ ని మాత్రమే ఆకట్టుకుంది. బి, సీ సెంటర్ల ఆడియెన్స్ కి రీచ్‌ కాలేకపోయింది. దీంతో అంతంత మాత్రంగానే మెప్పించింది. కానీ విజువల్‌గా వండర్‌గా, టెక్నీకల్‌గా ఈ మూవీ బ్రిలియెంట్‌గా ఉందని చెప్పొచ్చు. 

ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్ సేన్‌. ఆయన ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేశారు. మళ్లీ మార్చిలో అనుకున్నారు. `గామి` మూవీ కోసం వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ని ఇచ్చారు. మే 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే పక్కా ప్లాన్‌తోనే ఈ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఎందుకుంటే మే 13న తెలంగాణ, ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. జనాలు రిలాక్స్ అవుతారు. ఈ నేపథ్యంలో వినోదాన్ని కోరుకుంటారు. ఆ సమయంలోనే `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` రిలీజ్‌ కావడంతో అది ఈ మూవీకి హెల్ప్ కాబోతుందని చెప్పొచ్చు. చాలా వరకు సినిమాలు ఈ ఎన్నికల కోసం ఇంకా విడుదల తేదీలను ప్రకటించలేదు. ఈ మధ్యలో విడుదల చేస్తే సరైనా ఆదరణ దక్కదు. దీంతో ఎన్నికల తర్వాతే వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాయి. అయితే ఇందులో విశ్వక్‌ సేన్‌ టీమ్‌ ముందుగానే తేరుకోవడం విశేషం. 

ఇక విశ్వక్‌ సేన్‌ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. ఓ సాంగ్‌లోనూ ఆమె మెరవబోతుంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. షికర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ మాస్‌, రస్టిక్‌ రోల్‌లో కనిపించబోతున్నారు.