`బేబీ`తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆనంద్ దేవరకొండ.ఇప్పుడు జోనర్ మార్చి క్రైమ్ కామెడీ మూవీ చేశాడు. `గం గం గణేశా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే.
`బేబీ` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ `గం గం గణేశా`. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కామెడీ కొంత వరకు నవ్వించిందనే, కానీ ఆశించిన స్థాయిలో ఫన్ వర్కౌట్ కాలేదనే టాక్ వచ్చింది. వెన్నెల కిశోర్ పాత్ర సెకండాఫ్లో హైలైట్గా నిలిచింది. మొదటి రోజు డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లని ప్రకటించింది టీమ్. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.82కోట్ల గ్రాస్ని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఉన్నంతలో బెటర్గానే వచ్చిందని చెప్పొచ్చు. అయితే `బేబీ` సినిమాతో పోల్చితే చాలా డల్గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం సినిమాలపై జనంలో ఆసక్తి లేకపోవడం, పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడంతో దీనికి ఓపెనింగ్స్ తగ్గాయి. అయితే ఈ వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటే మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పొచ్చు.
ఇక `గం గం గణేశా` మూవీ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 5.50కోట్లు అయ్యింది. ఓవర్సీస్లో కోటీ, తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్లు అయ్యింది. ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆరు కోట్లు రావాలి. అంటే ఈ మూవీ 12కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఓపెనింగ్ రోజు వచ్చినట్టుగానే వారం మొత్తం మెయింటేన్ అయితేనే అది సాధ్యం లేదంటే బయ్యర్లకి నష్టాలు తప్పవు. మరి ఆడియెన్స్ ఏం చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ప్రధానంగా `గం గం గణేశా`తోపాటు విశ్వక్ సేన్ `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`, అలాగే కార్తికేయ `భజే వాయు వేగం` చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో `భజే వాయు వేగం` మూవీకి మంచి రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చాయి. సినిమా పరంగానూ పుంజుకుంటున్నట్టు తెలుస్తుంది. తొలి రోజు కంటే దీనికి థియేటర్ ఫుల్లింగ్ పెరిగిందట. విశ్వక్ సేన్ మూవీకి తగ్గిందని, ఆనంద్ మూవీ అంతే నడుస్తుందని టాక్. మరి ఈ మూడింటిలో ఏది విన్నర్గా నిలుస్తుందో చూడాలి.
