Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలో రికార్డ్ లు సృష్టిస్తోన్న ఫర్జీ వెబ్ సిరీస్, ఫుల్ జోష్ లో షాహిద్ కపూర్ -రాశీ ఖన్నా

ఇండియన్ ఓటీటీ హిస్టరీలో రికార్డ్స క్రియేట్ చేస్తోంది ఫర్జీ వెబ్ సిరీస్. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దండయాత్ర చేస్తోంది. సూపర్ ఫాస్ట్ గా ఆడియన్స్ లోకి దూసుకుపోయింది వెబ్ మూవీ. 
 

Farzi becomes most watched Indian OTT series of all time
Author
First Published Mar 26, 2023, 2:19 PM IST


ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తుంది. సినిమాలు రిలీజ్ అయినా..ఓటీటీల్లోకి వచ్చిన తరవాత చూసుకోవచ్చులే అనికుని చాలా మంది థియేటర్ కు వెళ్ళడం మానేశారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈక్రమంలో ఓటీటీల్లో వెబ్ సిరీస్ కంటెంట్ జనాలకు బాగా ఆకర్షిస్తోంది. దాంతో వీటి మధ్య పోటీ సినిమాలకంటే ఎక్కువైపోయింది. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్ ఇండియాలోనే నెంబర్ వన్ గా రికార్డ్స క్రియేట్ చేసింది. 


 షాహిద్ కపూర్ .. విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా  కలిసి నటించన మోస్ట్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఫర్జీ. ఈ  వెబ్‌ సిరీస్‌ ఒటీటీల్లో  సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇండియన్‌ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్‌ సిరీస్‌గా రికార్డు నెలకొల్పింది. ది ఫ్యామిలీమ్యాన్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌ గత నెలలో విడుదలైంది. ఫ్యామిలీ మెన్ కంటే ఎక్కువ స్పందన వచ్చింది ఈ వెబ్ మూవీతో. అసలు ముందు నుంచే ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అందులో రాజ్ డీకేలు డైరెక్ట్ చేయడం. షాహిద్ కపూర్ తో పాటు రాశీ ఖన్న కూడా నటించడంతో.. వెబ్ సిరీస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక విజయ్ సేతు పతి నటించడంతో.. తమిళంలో కూడా ఈ వెబ్ మూవీ దూసుకుపోయింది. 

అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిపోయి ఉన్న  ఈ వెబ్‌ సిరీస్‌ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది చూసినట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇక ఈ సిరీస్ తరువాత  స్థానాల్లో 32.7  మిలియన్లతో అజయ్‌ దేవగన్‌ రుద్ర  ఉండగా.. ఆతరువాత స్థానంలో 29.6 మిలియన్లతో.. పంచాయత్‌ సిరీస్ లు ఉన్నాయి.  షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌లో విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది.

నకిలీ  కరెన్సీ నోట్ల బ్యాక్ డ్రాప్ లో రూపోందిన ఈ వెబ్ సిరీస్ లో ఎలాంటి పేయింటింగ్‌ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడుగా షాహిద్‌ కపూర్‌ నటించారు.  ఆయన గీస్తే ఏది ఓరిజినలో.. ఏది డూప్లికేటో అని కూడా తెలియదు. ఆ సమయంలో ఆర్ధిక కష్టాలు తట్టుకోలేక.. ఒక మంచి పనికోసం..  దొంగ నోట్లను ముద్రించాలని ప్లాన్‌ చేస్తాడు. మరోవైపు ఆర్బీఐ  ఆఫీసర్‌గా రాశీ ఖన్నా. పోలీస్ ఆఫీసర్ గా విజయ్‌ సేతుపతి అద్భుతంగా నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ఉంటుందని గతంలోనే వెల్లడించారు మేకర్స్. త్వరలో ఆ పనులు స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios