Faria Abdullah:చిట్టి నిజం తెలుసుకుంది, కొత్త సినిమాకు సైన్ చేసింది
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది.
ఓవర్ నైట్ స్టార్ అయ్యింది చిట్టి...అదే జాతిరత్నాలు హీరోయిన్. ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి’ పాత్రలో నటించి యూత్ లో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ తన స్క్రీన్ ప్రెజన్స్ – క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో తొలి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. హైదరాబాద్ కు చెందిన తెలుగమ్మాయి అయిన ఫరియా దాదాపు ఏడేళ్లు థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేసింది. ఆ టైమ్ లోనే ‘నక్షత్ర’ అనే వెబ్ సిరీస్ లో చేసింది.
ఈ టైమ్ లోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది ఈ క్యూటీ. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘జాతి రత్నాలు’ చిత్రంతో చిట్టిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్తో ప్రేక్షకులు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెను ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లలో కూడా ‘చిట్టి’ అని పిలుస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. కానీ అలా జరగలేదు. చాలా చిన్న సినిమాలు లేదా ఐటెం సాంగ్ లు, స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయి. అంత పెద్ద హిట్ వచ్చాక ఫుల్ బిజీ అవుతాననుకుంటే..కాలేకపోయింది. దాంతో షాప్ లు ఓపెన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.
అయితే ఇప్పుడు కాస్త వాస్తవంలోకి దిగి వచ్చినట్లుంది. స్టార్స్ ప్రక్కన కాకపోయినా కాస్త గుర్తింపు ఉన్న హీరోలతో అయినా చేయకపోతే తనను మర్చిపోతారని అర్దం చేసుకున్నట్లుంది. దాంతో ఓ సినిమా కమిటైంది. త్వరలోనే మరో సినిమా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. "ఏక్ మినీ కథ" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఫరియా మాట్లాడుతూ.. "ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ నాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కూడా నా పాత్ర యువత కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది" అని చెప్పింది ఫరియ. ఇక ఇద్దరి పాత్రలు చాలా బాగుంటాయని, తన పాత్ర నచ్చే ఈ సినిమాకి సైన్ చేసినట్లుగా తెలిపింది ఈ బ్యూటీ. ఒరిజినాలిటీ ఉండే దర్శకులతో పని చేయడం అంటే తనకి చాలా ఇష్టమని, అలాగే సంతోష్ శోభన్ ఎంచుకునే స్క్రిప్ట్ పై కూడా తనకి చాలా నమ్మకం ఉందని చెప్పిన ఫరియ ఇప్పటిదాకా తనని కలవలేదని కానీ వారిద్దరి పెయిర్ వెండితెరపై చూడటానికి బాగుంటుంది అని అంటోంది.
Also Read ; Radhe Shyam:మేకర్స్ పై కోప్పడ్డ ప్రభాస్? ఇలాగైతే కష్టం