Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే టాక్ షో తో త‌రుణ్‌ భాస్క‌ర్,డిటేల్స్

కరోనా ప్రభావంతో కొద్ది కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్న తరుణ్ ..టాక్ షోల వైపు తన దృష్టిని పెట్టారు. తాజాగా ఆయన అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ కు ఓ టాక్ షో చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. 

Director Tharun Bhasker to host a talk show for AHA
Author
Hyderabad, First Published Aug 28, 2020, 8:06 AM IST

పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు తరుణ్‌ భాస్కర్‌. తొలి చిత్రంతోనే హిట్‌ అందుకున్నారాయన.ఆ తర్వాత  ఆయన హీరోగా వెండితెరకు పరిచయమవుతూ 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా చేసారు. ఆ సినిమా చెప్పుకోదగిన రీతిలో వర్కవుట్ కాకపోయినా తరుణ్ భాస్కర్ కు నటుడుగానూ మంచి పేరు తెచ్చిపెట్టింది. కరోనా ప్రభావంతో కొద్ది కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్న తరుణ్ ..టాక్ షోల వైపు తన దృష్టిని పెట్టారు. తాజాగా ఆయన అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ కు ఓ టాక్ షో చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. 

ఓటీటి ప్లాట్ ఫామ్ లు క్లిక్ అవటానికి టాక్ షోలు బాగా ఉపకరిస్తున్నారు. ఇప్పుడందరూ అదే దారిలో వెళ్తున్నారు. విభిన్నమైన టాక్ షో లకు మంచి డిమాండ్ ఉంది. తరుణ్ భాస్కర్ సైతం ఓ విభిన్నమైన టాక్ షోతో ముందుకు వచ్చి అల్లు అరవింద్ ని మెప్పించి, స్లాట్ తీసుకున్నాడంటున్నారు. ఇక ఇప్పటికే ఆహా వారు సుమతో ఆల్ ఈజ్ వెల్ అనే టాక్ షో చేస్తోంది. ఇక తరుణ్ భాస్కర్ చేయబోయే షో పేరు రీయూనియన్.
  
ఈ షో ప్రత్యేకత ఏమిటంటే...ఇప్పటికే రిలీజైన సినిమాకు సంభందిన టెక్నీషియన్స్, నటీనటులు కొందరు ఈ షోకు వస్తారు. అంటే మళ్లీ రీయూనియన్ అవుతారు. వాళ్లంతా కూర్చుని తమ సినిమా విశేషాలు, షూటింగ్ ముచ్చట్లు చెప్పుకుంటారు. హిట్టైన సినిమాలకు సంభందిన క్రూ వస్తారు కాబట్టి..చూసేవాళ్లకీ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మీడియాలోనూ ఆయా సినిమాల విశేషాలతో షోకు బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ షో ని తరుణ్ భాస్కర్ యాంకరింగ్ చేస్తారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 
 
  
సినీ కెరీర్ విషయానికి వస్తే...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వచ్చిన  `పెళ్లిచూపులు`తో  తరుణ్‌భాస్క‌ర్ పేరు ఒక్కసారిగా మారు మ్రోగిపోయింది. ఈ సినిమాతో తరుణ్ కు అభిమానులు సైతం ఏర్పడ్డారు. ద‌ర్శ‌కుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. ఆ  సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ద‌ర్శ‌కుడిగా గ్యాప్ తీసుకుని నటుడుగా సినిమా చేసాడు.

`మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ తన నటనతో  ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ నేపధ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌ైంది. మరో ప్రక్క తరుణ్ అతి త్వ‌ర‌లో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.  .హార్స్ రైడింగ్ నేపధ్యంలో వెంకటేష్ తో ఈ  సినిమా చేయటానికి సిద్దపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios