ఎన్టీఆర్ బామ్మర్ధి కాదా.. తేజా మరీ ఎక్కువ అడిగారా?!
ఈ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర ని పరిచయం చేస్తున్నాడని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తూచ్ అంటున్నారు. తేజ తన కొడుకు అమితోబ్ తేజ ని పరిచయం చేయబోతున్నారట. అయితే మరి ఎన్టీఆర్ బావమరిది అని వచ్చిన వార్తలు రూమర్సేనా అంటే కొంతలో కొంత నిజం లేకపోలేదు అంటున్నారు.
తేజ దర్శకత్వంలో రూపొందబోయే 'చిత్రం 1.1' ఎనౌన్సమెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర ని పరిచయం చేస్తున్నాడని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తూచ్ అంటున్నారు. తేజ తన కొడుకు అమితోబ్ తేజ ని పరిచయం చేయబోతున్నారట. అయితే మరి ఎన్టీఆర్ బావమరిది అని వచ్చిన వార్తలు రూమర్సేనా అంటే కొంతలో కొంత నిజం లేకపోలేదు అంటున్నారు. తెర వెనక కొన్ని డిస్కషన్స్ జరిగాయని చెప్తున్నారు. అయితే అవి అనుకున్న స్దాయిలో ఫలించలేదని అంటున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి డైరక్టర్ తేజ తన తొలి చిత్రం 'చిత్రం' కు సీక్వెల్ కు ఓ ప్రక్కన స్క్రిప్టు రెడీ చేస్తూ మరో ప్రక్క హీరోలు వేట మొదలెట్టారట. హీరోకు ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నవాడు..ఆ కుటుంబాలకు చెందినవాడు అయితే ప్రమోషన్ పరంగా బెస్ట్ అని భావించారట. అందుకోసం మొదట సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ ని టచ్ చేసారట. అతన్ని 'చిత్రం 1.1' తో లాంచ్ చేద్దామని సురేష్ బాబు దగ్గర ప్రపోజల్ పెట్టారట. కొద్ది రోజులు దానిపై డిస్కషన్స్ జరిగి, లాస్ట్ మినిట్ ...డెసిషన్ ఛేంజ్ చేసుకున్నారట.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అధినేత,టీవీ ఛానెల్ ఓనర్ అయిన నార్నే శ్రీనివాసరావు కుమారుడుని సీన్ లోకి తెద్దామనుకున్నార. ఆ కుర్రాడు ఆల్రెడీ యాక్టింగ్ క్లాస్ లకు వెళ్లాడని, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాడని తెలిసి ఎప్రోచ్ అయ్యారట. దాంతో జూ. ఎన్టీయార్ బావమరిది 'చిత్రం 1.1'తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే... నార్నే శ్రీనివాసరావు కూడా కొంత మొత్తం పెట్టుబడి పెడితే, మంచి బడ్జెట్ మూవీగా వాళ్ల అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా తీస్తానని తేజ చెప్పారట. దానికి నార్నే శ్రీనివాసరావు ఓకే అన్నా.. తేజ కోట్ చేసిన అమౌంట్ దగ్గర ఆగిపోయిందిట. దాంతో మరీ ఎక్కువగా అనిపించటంతో శ్రీనివాసరావు వెనక్కి తగ్గినట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఆ క్రమంలో ఇప్పుడు తేజ...వేరే వాళ్లను హీరోగా పరిచయం చేసే బదులు తన కొడుకు అమితోవ్ తేజను పెట్టి సినిమా తీస్తే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చాడట. ఆ విధంగా తేజ కొడుకుకు హీరో అయ్యే ఛాన్స్ దక్కుతోందని వినపడుతోంది. షూటింగ్ ఈనెల 18న జరుగబోతున్నట్లుగా చెబుతున్నారు. చిత్రం ప్రారంభోత్సవం కూడా అప్పుడే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో హీరో ఎవరనేది అప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది.