ఈశ్వరన్ సినిమా ఆడియో లాంచ్ వేదికపై జరిగిన ఈ సంఘటన పలు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ సుశీంద్రన్ పై విరుచుకుపడ్డారు. దీనితో సుశీంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ఇస్మార్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ తో దర్శకుడు సుశీంద్రన్ ప్రవర్తన వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈశ్వరన్ సినిమా ఆడియో లాంచ్ వేదికపై జరిగిన ఈ సంఘటన పలు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ సుశీంద్రన్ పై విరుచుకుపడ్డారు. దీనితో సుశీంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈశ్వరన్ మూవీలో నిధి అగర్వాల్ హీరో శింబూ వెంటపడే అమ్మాయిగా కనిపిస్తారు. మామా ఐ లవ్ యూ.. అంటూ నిధి, శింబు వెంట పడతారు. అందుకే వేదికపై నిధిని... శింబూ మామ ఐ లవ్ యూ... అని చెప్పాలని కోరినట్లు ఆయన చెప్పారు. అంతకు మించి మరో ఉద్దేశం లేదని సుశీంద్రన్ అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈశ్వరన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. దీనితో చిత్ర యూనిట్ ఆడియో వేడుక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడడానికి వేదికపైకి వెళ్లడం జరిగింది. నిధి మాట్లాడుతుండగా వేదికపైకి వెళ్లిన సుశీంద్రన్ 'శింబు మామా ఐ లవ్ యూ' అనాలని కోరారు. దానికి నిధి అగర్వాల్ చెప్పనని సున్నితంగా తిరస్కరించారు. సుశీంద్రన్ ఈ విషయంలో నిధి అగర్వాల్ ని కొంచెం బలవంతం చేయడం వివాదాస్పదం అయ్యింది. 

సుశీంద్రన్ చర్యలకు నిధి అగర్వాల్ ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో సుశీంద్రన్ వివరణ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా ఈశ్వరన్ మూవీ విడుదల కానుంది. సీనియర్ దర్శకుడు భారతీరాజా కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చిడం జరిగింది.