`రంగస్థలం` సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్. `రంగస్థలం` కథ చెప్పినప్పుడు రామ్చరణ్కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట.
సుకుమార్ ఆలోచనలు పదేళ్ల ముందుంటాయని, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారని, కాస్త దిగొచ్చి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయని ఓ ప్రెస్మీట్లో దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా చెప్పాడు. అలా సుకుమార్ దిగొచ్చి చేసిన సినిమానే `రంగస్థలం`. ఆయన చెప్పినట్టుగానే ఇది సంచలన విజయం సాధించింది. రామ్చరణ్ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది. కమర్షియల్ చిత్రాల ట్రెండ్కి బ్రేకులు వేసి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్చరణ్ చెవిటి వాడిగా రామ్చరణ్ అద్భుతమైన నటనని పలికించాడు.
తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్. `రంగస్థలం` కథ చెప్పినప్పుడు రామ్చరణ్కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట. కానీ అందులోని ఓ సీన్ చెప్పేటప్పుడు మాత్రం తాను చాలా టెన్షన్ పడ్డానని చెప్పాడు. రామ్చరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఆయన దీన్ని తీసుకుంటాడా? లేదా? అని భయపడ్డాడట. ఆ సీన్ గురించి చెబుతూ, ప్రకాశ్ రాజ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని సపర్యలు హీరోనే చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మార్చడం, చివరికి టాయిలెట్ బ్యాగ్ తనే తీయాల్సి ఉంటుంది. ఈ లైన్ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, కానీ చెప్పాక రామ్చరణ్ మాత్రం మరో మాట లేకుండా చేసేద్దామని కూల్గా చెప్పారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సుకుమార్.
అది నిజంగా తనకు సర్ప్రైజింగ్గా అనిపించిందన్నారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. టెన్షన్ పడుతూనే ఈ సీన్ను వివరించాడట. కానీ చరణ్ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణమది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్చరణ్ వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశారని సుకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ నాన్న చిరంజీవితో కలిసి `ఆచార్య` మూవీలో `ఆర్ఆర్ఆర్`లో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నారు. ఇక సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా `పుష్ప` సినిమాని రూపొందిస్తున్నారు. ఇది కూడా రాగా.. ఉండబోతుందని తెలుస్తుంది. మరో `రంగస్థలం`ని మించిన సినిమా అవుతుందని అంటున్నారు.
