మిర్చి కాంబినేషన్ రిపీట్ కానుందా?
కొరటాల శివ-ప్రభాస్ కాంబినేషన్ లో మూవీ ఖాయమేనన్న వార్తలు వినిపిస్తుంది. ఎన్టీఆర్ మూవీ తర్వాత కొరటాల ప్రభాస్ తో మూవీ చేయనున్నారట. దీంతో మిర్చి కాంబినేషన్ రిపీట్ కానుందట.
ఆచార్య మూవీ కొరటాలకు భారీ ఝలక్ ఇచ్చింది. ఆ చిత్రాన్ని ఆయన తలాతోకా లేకుండా తెరకెక్కించాడని విమర్శలు వినిపించాయి. చిరంజీవి(Chiranjeevi), చరణ్ కెరీర్ లో వరస్ట్ మూవీగా ఆచార్య నిలిచిపోయింది. ఆచార్య బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూవీతో కమ్ బ్యాక్ కావాలని కొరటాల భావిస్తున్నారు. ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పకడ్బందీగా తయారు చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక కొరటాల చిత్రం కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ 30(NTR 30) ప్రీ లుక్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా ఎన్టీఆర్ 30 అనంతరం దర్శకుడు కొరటాల హీరో ప్రభాస్ తో మూవీ చేసే అవకాశం కలదంటున్నారు. ఈ మేరకు చర్చలు జరగ్గా మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నారట. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో మూవీ ఖాయమేనన్న మాట వినిపిస్తుంది. ఇక దర్శకుడిగా కొరటాలకు మొదటి చిత్రం ప్రభాస్ తోనే కావడం విశేషం. 2013లో విడుదలైన మిర్చి మూవీతో రైటర్ కొరటాల దర్శకుడయ్యాడు.
మిర్చి భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ లో మరలా మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం కొరటాల దర్శకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్(Prabhas) వరుస ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా, సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. ఇక మారుతి దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి కొరటాలతో ప్రభాస్ మూవీ మూడేళ్ల తర్వాత ఉండవచ్చు.