దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమాతో భారీ హిట్ ని అందించాడు. 2016 లో విడుదలైన ఈ సినిమా నలభై కోట్ల షేర్ ని రాబట్టింది.
దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమాతో భారీ హిట్ ని అందించాడు. 2016 లో విడుదలైన ఈ సినిమా నలభై కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు.
సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా శేఖర్ కమ్ముల రూ.7 కోట్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ షాకింగ్ విషయమేమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ రూ.4 కోట్లు మాత్రమే.. సినిమా బడ్జెట్ కంటే శేఖర్ కమ్ముల ఎక్కువ పారితోషికం తీసుకుంటుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణం 'ఫిదా' సినిమా అనే చెప్పాలి.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. మార్కెట్ లో శేఖర్ కమ్ములు డిమాండ్ కూడా పెరిగింది. ఆ కారణంగానే ఆయనకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారు. అందరూ కొత్తవాళ్లతో రూపొందిస్తోన్న ఈ సినిమాతో మరోసారి శేఖర్ కమ్ముల హిట్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 16, 2019, 11:57 AM IST