తన నటనతో నన్ను ఇంప్రెస్ చేసింది: రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తను చూసే సినిమాల గురించి సోషల్ మీడియా స్పందిస్తుంటారు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తను చూసే సినిమాల గురించి సోషల్ మీడియా స్పందిస్తుంటారు. తనకు ఏ సినిమా నచ్చినా దాని గురించి గొప్పగా పోస్ట్ లు పెడుతుంటారు. రీసెంట్ గా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా చూసిన జక్కన్న యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
అలానే సుదీర్ బాబు, అదితిరావు హైదరి కలిసి నటించిన 'సమ్మోహనం' సినిమాపై కూడా ఓ ట్వీట్ చేశారు. 'సమ్మోహనం సినిమా కాస్త ఆలస్యంగా చూశాను కానీ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాను. అదితిరావు నటన నేను ఇంప్రెస్ అయ్యేలా చేసింది. సుదీర్ బాబు కూడా బాగా నటించాడు. సీనియర్ నటుడు నరేష్ అధ్బుతంగా చేశారు. చిత్రబృందానికి నా అభినందనలు' అని వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి.. తారక్, చరణ్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Tharun Bhascker does it again.
— rajamouli ss (@ssrajamouli) June 29, 2018
A ‘Sukoon’ film with lots of laughter. Hearty Congrstulations to team #EeNagaranikiEmaindi...
Watched #Sammohanam little late... Quite impressed with @aditiraohydari‘s performance. @isudheerbabu is good too. @ItsActorNaresh garu is hilarious. Belated Congratulations to the team... 😊
— rajamouli ss (@ssrajamouli) June 29, 2018