Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన పూరీ, ఛార్మీ ఈడీ విచారణ... 13 గంటల పాటు ప్రశ్నల వర్షం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సినీ నటి ఛార్మీల ఈడీ విచారణ ముగిసింది. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయినట్లుగా తెలుస్తోంది. 

director puri jagannadh and charmi kaur's ed Inquiry end
Author
First Published Nov 17, 2022, 9:04 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సినీ నటి ఛార్మీల ఈడీ విచారణ ముగిసింది. లైగర్ సినిమా ఆర్ధిక లావాదేవీలపై దాదాపు 13 గంటల పాటు వీరిద్దరినీ ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులపైనా అధికారులు ఆరా తీశారు. కొందరు లైగర్ మూవీలో హవాలా, మనీలాండరింగ్ రూపంలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయినట్లుగా తెలుస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios