Asianet News TeluguAsianet News Telugu

సహనం కోల్పోయిన క్రేజీ డైరెక్టర్.. 'ఉప్పెన' బ్యూటీపై ఫైర్, వైరల్ న్యూస్ నిజమా?

ఉప్పెన చిత్రంతో సౌత్ లో సెన్సేషన్ గా మారింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. లవ్, ఎమోషనల్ సీన్స్ తో పాటు క్యూట్ లుక్స్ తో ఉప్పెనలో కృతి శెట్టి అదరగొట్టేసింది. ఊహించిన దానికంటే ఉప్పెన పెద్ద హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

Director Linguswamy fires on Uppena Heroine Krithi shetty
Author
Hyderabad, First Published Aug 10, 2021, 4:11 PM IST

ఉప్పెన చిత్రంతో సౌత్ లో సెన్సేషన్ గా మారింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. లవ్, ఎమోషనల్ సీన్స్ తో పాటు క్యూట్ లుక్స్ తో ఉప్పెనలో కృతి శెట్టి అదరగొట్టేసింది. ఊహించిన దానికంటే ఉప్పెన పెద్ద హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం కృతి శెట్టి హీరో రామ్ పోతినేని సరసన..ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

కృతి శెట్టికి ఇది మరో అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అయింది. లేటెస్ట్ గా కృతి శెట్టి గురించి ఓ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కృతి శెట్టి దర్శకుడు లింగుస్వామి సహనానికి పరీక్ష పెట్టడమే కాదు.. ఆయన ఆగ్రహానికి గురైందట. 

సరిగ్గా నటించకపోతే దర్శకులు హీరోయిన్లని మందలిస్తారు, అవసరమైతే దండిస్తారు అనే ప్రచారం ఎన్టీఆర్ కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటి దర్శకుల్లో తేజపై కూడా అలాంటి రూమర్స్ ఉన్నాయి. సినిమా తాను కోరుకున్న విధంగా రావడం కోసం ఎలాంటి ట్రిక్ అయినా వాడతా అని తేజ ఒప్పేసుకున్నారు కూడా. 

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే.. సెట్స్ లో లింగుస్వామికి తీవ్ర ఆగ్రహం వచ్చిందట. ఆమె నటనపై లింగుస్వామి ఒక్కసారిగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లింగుస్వామి.. నాజర్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి ఎమోషనల్ సీన్ తెరకెక్కిస్తున్నారట. నాజర్ నటనని ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆయన అద్భుతమైన నటుడు. ఇక కృతి శెట్టి మాత్రం సరైన హావభావాల కోసం ఎక్కువ టేక్స్ తీసుకుంటోంది. 

గంట గడచినా ఆమెలో హావభావాలు దర్శకుడికి నచ్చడం లేదు. దీనితో సహనం కోల్పోయిన లింగుస్వామి.. కృతి శెట్టిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. షూటింగ్ కి ముందే ఒకసారి ప్రాక్టీస్ చేయాలని సూచించారట. ఉప్పెనలో మంచి మార్కులు కొట్టేసిన కృతి శెట్టి.. లింగుస్వామిని మెప్పించడంలో విఫలం అవుతోంది అని అంటున్నారు. 

ఈ చిత్రంపై హీరో రామ్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంతటి మాస్ హిట్ కోసం రామ్ ట్రై చేస్తున్నాడు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios