Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై వేమన పద్యాలు.. వైరల్‌ అవుతున్న క్రిష్ ట్వీట్‌

అది త‌మ సిద్దార్థ ఫార్మ‌సీ కాలేజీ వాట్సాఫ్ గ్రూఫులో వ‌చ్చింద‌ని..ఎవ‌రు రాశారో తెలియ‌ద‌ని చెప్పారు. ఆ ప‌ద్యం కాస్తా ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పద్యాలు చాలా సరదాగా కరోనా పై అవగాహన కలిగించేలా ఉన్నాయి.

Director Krish shares Corona satakam
Author
Hyderabad, First Published Jun 18, 2020, 11:35 AM IST

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మ‌హ‌మ్మారికి ఇప్ప‌టివ‌రకు స‌రైన వ్యాక్సిన్ లేదా మెడిసిన్ అందుబాటులో వచ్చే వరకూ ఇదే పరిస్దితి.  ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇవ్వటంతో ఇండియాలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.  ఈ నేప‌థ్యంలో అనేక మంది సెల‌బ్రిటీలు క‌రోనా గురించి ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. అశ్ర‌ద్ద వ‌హిస్తే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్క‌రు ఒక్కో పంథా ఎన్నుకుంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనావైర‌స్ పై ఎవ‌రో రాసిన ఓ వేమ‌న పేరడీ ప‌ద్యాన్ని డైరెక్ట‌ర్ క్రిష్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. 

అది త‌మ సిద్దార్థ ఫార్మ‌శీ కాలేజీ వాట్సాఫ్ గ్రూఫులో వ‌చ్చింద‌ని..ఎవ‌రు రాశారో తెలియ‌ద‌ని చెప్పారు. ఆ ప‌ద్యం కాస్తా ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పద్యాలు చాలా సరదాగా కరోనా పై అవగాహన కలిగించేలా ఉన్నాయి.

కాగా ప్ర‌స్తుతం క్రిష్‌.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ 27వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. చారిత్రక నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసమే లుక్ కూడా మార్చేసాడు పవర్ స్టార్. కోరమీసాలతో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్  బాగా ట్రెండ్ అయ్యింది. ఇందులో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పీరియాడికల్ సినిమా కావడంతో పవన్ కూడా ఈ చిత్రం కోసం చాలానే కష్టపడాలి. ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్కసారి కూడా ఈయన చారిత్రాత్మక సినిమా చేయలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios