బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?
బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్ చేశారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురువారంతో పోల్చితే కాస్త మెరుగ్గా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం హెల్త్ బులిటెన్ని విడుదల చేశారు. `వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఐసీయులోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తమ వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంద`ని తెలిపారు.
మరోవైపు బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. `ఈ రోజు నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంటే ఆయన పూర్తిగా కోలుకున్నారని కాదు. వైద్యుల బృందం మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగపడే విషయమై ఎంతో నమ్మకంతో ఉంది. మీ అందరి ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ పరిణామం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు` అని తెలిపారు.
ఇదిలా ఉంటే బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్ చేశారు.
గత కొన్ని రోజులు గాయకుడు బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశీ వైద్యుల సలహాలతో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.