Asianet News TeluguAsianet News Telugu

అమితాబచ్చన్ ను కలిసిన డైరెక్టర్ చందూ మొండేటి, ఏం మాట్లాడుకున్నారంటే..?

కార్తికేయ2 డైరెక్టర్ చందూ మొండేటి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ఇంతకీ వీరు కలవడం వెనుక కారణం ఏంటీ..? 
 

Director chandu mondeti meets Indian Megastar amitabh bachchan
Author
Hyderabad, First Published Aug 19, 2022, 8:14 PM IST

కార్తికేయ-2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్  చందు మొండేటి.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు. ఆయనను కలిసిన పిక్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు దర్శకుడు. ఈ సందర్భంగా చందు మొండేటి ట్విట్టర్ లో స్పందించారు.. ఈ విధంగా రాశారు.  అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. 

నిఖిల్, అనుమపమ పరమేశ్వరన్  హీరోహీరోయిన్లు గా చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన  సినిమా కార్తికేయ2. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇక తెలుగుతో పాటు ఈసినిమా హిందీలో సైతం ఆడియన్స్ నుంచి ప్రశంసలు పొందింది. ఏ మాత్రం అంచనాలు, హడావుడి, సందడి లేకుండా రిలీజ్ అయిన కార్తికేయ2 సినిమా.. అనూహ్యంగా.. ఊహించనిదానికంటే ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా హిట్ కావడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

ఇక ఉత్తరాధిన ముందుగా  50 కన్నా తక్కువ స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మంచి స్పందన వస్తుండటంతో.. ఈసినిమాను .. ప్రస్తుతం వెయ్యికి పైగా స్క్రీన్లకి పెంచారు. అన్నిరకాలుగా ఈ మూవీ సక్సెస్ సాధించడంతో.. మూవీ టీమ్ ఫుల్ జోష్ మీద ఉంది. టీమ్ అంతా పార్టీలు చేసుకుంటుంది.  ఇక ఈ సినిమాలో  బాలీవుడ్ సీనియర్ స్టార్  అనుపమ్ ఖేర్ ఇంపార్టెంట్ రోల్ లో  నటించారు. ఇక కార్తికేయ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ వ్వడంతో.. ఈ సినిమాకు మరో సీక్వెల్ గా.. కార్తికేయ 3 కూడా రాబోతున్నట్టు ఇప్పటికే దర్శకుడు  క్లారిటీ ఇచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios