Asianet News TeluguAsianet News Telugu

‘వి’ : ఎంత రేటుకి ఓటీటికు ఇచ్చారంటే...

నాని 25వ చిత్రం ‘వి’. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడు. సుధీర్‌భాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. 

Dil Raju received Rs. 31 cr for V  movie
Author
Hyderabad, First Published Aug 17, 2020, 10:03 AM IST

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. నిజానికి ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ఈ సినిమాని ఓటీటిలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటిదాకా చాలా వ‌ర‌కు ఓ మోస్త‌రు చిత్రాలు ఓటీటీలో విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నాని వి‘’ కోసం ఓటీటీ నుండి భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, అందుకే ఓకే చెప్పారని చెప్తున్నారు. ప్రారంభంలోనే ఈ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ నో చెప్పిన దిల్‌రాజు ఎట్ట‌కేల‌కు ఓకే చెప్పార‌ని, ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ‌తో డీల్ కుదిరింద‌ని స‌మాచారం. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఓటీటి వారు ఎంత చెల్లించారనేది ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న మేరకు ఈ చిత్రాన్ని టాక్స్, జీఎస్టీ అన్ని పోనూ 31 కోట్లకు డీల్ సెట్ అయ్యిందిట. దాంతో చాలా మంది మొత్తానికే ఈ సినిమాని ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ సినిమా హిందీ రైట్స్ ని ఆరు కోట్లకు అమ్మారు. దాంతో మొత్తం దిల్ రాజుకు ఈ సినిమా నిమిత్తం 37 కోట్లు ముట్టిందని, లాస్..లాభం రెండు లేవని అంటున్నారు. అయితే రిస్క్ లేకుండా ఓటీటి రిలీజ్ ఇదని, లేకపోతే థియోటర్స్ అయితే  పదికోట్లు రిస్క్ ఉండేదని లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో మంచి లాభాలు కూడా చూసే అవకాసం ఉండేదని చెప్పుతున్నారు.
 
ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.  నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్,టీజర్  కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.  

నాని  ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను క్రిసమస్ కానుకగా విడుదల కానుందా లేదా అన్నది సస్పెన్స్.

Follow Us:
Download App:
  • android
  • ios