Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 2.. కౌశల్ కెప్టెన్ అవుతాడా..?

ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా.. పబ్లిక్ కాలర్స్‌గా విడిపోయి గేమ్‌లో గెలిచేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

did koushal win the captancy task?
Author
Hyderabad, First Published Aug 17, 2018, 10:31 AM IST

నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 గేమ్ షో.. ఆసక్తి కరంగా సాగుతోంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి బిగ్ బాస్ టెలి కాలర్స్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా.. పబ్లిక్ కాలర్స్‌గా విడిపోయి గేమ్‌లో గెలిచేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

నేటి ఎపిసోడ్‌లో కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న రోల్ రైడాతో నూతన్ నాయుడు ఫోన్ చేసి విసిగించే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. రోల్ రైడా యాస పట్ల నూతన్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీరియస్‌గా స్పందించారు రోల్ రైడా. గల్లీ నుండి వచ్చి గల్లీకి మాత్రమే పరిమితం కావాలని అనుకుంటున్నావా అని నూతన్ నాయుడు అనడంతో.. గల్లీ వాళ్లు బిగ్ బాస్‌కి రాకూడదా? వెంటనే గల్లీ వాళ్లకు క్షమాపన చెప్పాలన్నారు రోల్ రైడా. అయితే నీకు గల్లీ వాళ్లపై గౌరవం ఉంటే ఫోన్ పెట్టాయాలని నూతన్ నాయుడు అనడంతో ఆవేశంగా ఫోన్ పెట్టేశాడు రోల్ రైడా. దీంతో గల్లీ వాళ్లపై గౌరవంతో ఫోన్ పెట్టేసిన రైడాకి నా సలామ్ అని నూతన్ నాయుడు ఫోన్ పెట్టేశారు. 

అయితే రోల్ రైడా ఫోన్ పెట్టింది తన ఫోన్‌ మీద కాదు.. పక్కన ఉన్న తనీష్ ఫోన్‌పై తన రిసీవర్ పెట్టి నూతన్ నాయుడ్ని బోల్తా కొట్టించి పాయింట్ సాధించాడు. దీంతో ఖంగు తిన్నారు నూతన్ నాయుడు. 

రెండో కాలర్‌గా దీప్తి నల్లమోతు.. కాలర్ ఉద్యోగిగా ఉన్న సునయనకు కాల్ చేసింది. అయితే ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణలు నడిచాయి. అయితే కౌశల్‌ టీం సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా పబ్లిక్ కాల్స్‌ను మర్యాదగా డీల్ చేశారు. కాని తనీష్ టీం సభ్యులు పబ్లిక్ కాలర్స్‌తో మాట్లాడుతూ మర్యాదను పక్కనపెట్టేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ముఖ్యంగా సునయన, రోల్ రైడాలు మేం ఇలాగే మాట్లాడతాం అంటూ డిన్నర్, లంచ్‌లను కాల్స్ మాట్లాడుతూనే కానిచ్చేశారు. 

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు కౌశల్. కనీసం కాల్ సెంటర్ ఉగ్యోగం చేసే వాళ్ల కైనా రెస్పెక్ట్ ఇవ్వాలని భోజనం చేస్తూ కాల్ సెంటర్ ఉద్యోగులు పబ్లిక్‌తో మాట్లాడతారా? అంటూ క్వచ్ఛన్ చేశారు. ఇక ‘కాల్ సెంటర్’ టాస్క్‌లో తనీష్ టీం 7 పాయింట్లు సాధించగా.. కౌశల్ టీం 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ సదర్భంగా విజేతగా నిలిచిన కౌశల్‌ టీంను అభినందించారు బిగ్ బాస్. 

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో స్పెషల్ స్కిట్స్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు కంటెస్టెంట్స్. సునయన, రోల్ రైడా, గీతా మాధురి, శ్యామల, సామ్రాట్‌లు వేసిన ‘భరత మాత’ స్కిట్ ఆకట్టుకుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఈవారం కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రోల్ రైడా, కౌశల్‌ల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. ఈ పోరులో గెలిచేది ఎవరో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో తేలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios