#Dhanush: ధనుష్ విలన్ గా ... అల్లు అరవింద్ రిలీజ్
విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్. ‘7/జీ బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఎన్జీకే’ వంటి విలక్షణ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతడికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆయన మరో చిత్రాన్ని డైరక్ట్ చేసారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వా రాఘవన్ డైరెక్షన్ చేశాడు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. ‘నానే వరువెన్’ చిత్రానికి సెల్వ రాఘవనే దర్వకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్... ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
హీరోగా, విలన్గా రెండు పాత్రలను ధనుష్ ఈ చిత్రంలో పోషించాడు. ధనుష్ నెగిటివ్ రోల్ లో కనపడుతూండటంతో ప్రస్తుతం కోలీవుడ్లో చర్చగా మారింది. చిత్రంపై భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేందుకు వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ తెలుగు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో 'నేనే వస్తున్నా' అనే టైటిల్ను ఖరారు చేస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు. 'నేనే వస్తున్నా' మూవీలో ధనుష్ రెండు పాత్రల్లో నటించాడు. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించాడు. ధనుష్కు జోడీగా ఎల్లిడ్ ఆవ్రమ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే 'తిరు' మూవీతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ఈ సినిమాతో మరో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
గత నెల 18న విడుదలైన 'తిరు' మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న 'సార్' సినిమా చిత్రీకరణ దశలో ఉంది.