ఆడియెన్స్ కి షాక్ ఇచ్చిన థియేటర్.. `ధమ్కీ`కి బదులు `ధమాకా` ప్రదర్శన.. ఆడియెన్స్ గోల..
`ధమ్కీ` సినిమా చూసేందుకు వచ్చిన ఆడియెన్స్ కి పెద్ద షాకిచ్చింది థియేటర్ సిబ్బంది. ఆ సినిమాకి మరో సినిమా ప్రదర్శించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది.
ఓ థియేటర్ యాజమాన్యం ఆడియెన్స్ కి పెద్ద షాకిచ్చారు. `ధమ్కీ` ఆడియెన్స్ కి `ధమాకా` సినిమా చూపించాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `దాస్ కా ధమ్కీ`. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. నివేతా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నేడు ఉగాది సందర్భంగా బుధవారం(మార్చి 22)న విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది.
ఇదిలా ఉంటే ఓ థియేటర్లో `ధమ్కీ` సినిమా కోసం వచ్చిన ఆడియెన్స్ కి పెద్ద షాక్ ఎదురైంది. `ధమ్కీ` కోసం వస్తే, `ధమాకా` చూపించడంతో షాక్ అయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వైజాగ్లోని సుకన్య థియేటర్ ల `ధమ్కీ`కి బదులు `ధమాకా` చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమా చూసేందుకు థియేటర్లోపలికి వచ్చిన ఆడియెన్స్ `ధమాకా` టైటిల్స్ చూసి ఆశ్చర్యపోయారు. దానికి బదులు ఇది ప్రదర్శిస్తున్నారని అర్థం కావడంతో థియేటర్ లోనే గోల పెట్టారు. దీంతో తప్పుని గమనించిన థియేటర్ సిబ్బంది వెంటనే తప్పు దిద్దుకుని `ధమ్కీ`ని ప్రదర్శించారు.
ఈ వీడియోని తీసిన ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. రెండు సినిమాల టైటిల్స్ దగ్గరగా ఉండటంతో సిబ్బంది కన్ ఫ్యూజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కామెడీ ఎమోజీలు పెడుతున్నారు. మరోవైపు రాత్రి తాగింది దిగలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన `ధమాకా` చిత్రం గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అయి రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది.
ఇక విశ్వక్ సేన్ చివరగా `ఓరిదేవుడా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తనే దర్శకత్వం వహిస్తూ, ద్విపాత్రాభినయం చేస్తూ `ధమ్కీ` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాని కూడా తనే నిర్మించడం విశేషం. ఉగాది సందర్భంగా విడుదలైన సినిమా రెగ్యూలర్ కమర్షియల్ మూవీలా నిలిచింది. థియేటర్లలో మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది.