బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్.. ఒకరి ఎలిమినేషన్..?
బిగ్ బాస్ సీజన్ 2 మరో మూడు రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫైనల్స్ కి వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్లు సామ్రాట్, కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్ లు ఉన్నారు. ఆఖరి వారం కావడంతో హౌస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 2 మరో మూడు రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫైనల్స్ కి వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్లు సామ్రాట్, కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్ లు ఉన్నారు. ఆఖరి వారం కావడంతో హౌస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో హౌస్ నుండి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.. దీప్తి నల్లమోతు. శని, ఆదివారాల్లో జరిగే ఎలిమినేషన్ మధ్యలో జరగడమేంటి..? అనుకుంటున్నారా..? బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు అంటోన్న బిగ్ బాస్
ఈ మిడ్ ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ ఎలిమినేషన్ లో దీప్తిని బయటకి పంపించి నలుగురుని ఫినాలేకి పంపాలనేది ప్లాన్. ఓటింగ్స్ ప్రకారం దీప్తిని బయటకి పంపబోతున్నారని సమాచారం. ఇటీవల దీప్తిపై ఫేక్ ఓటింగ్ ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఆమె ఎలిమినేట్ అయితే సామ్రాట్, తనీష్, గీతామధురి, కౌశల్ లు ఫైనల్స్ కి వెళ్తారు. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి ఇద్దరిని ఫైనల్ కి పంపుతారు. వారిలో ఒకరిని బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా ప్రకటించనున్నారు.